Home Minister Mahmood Ali: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫైటింగ్ వ్యవహారం హోం మంత్రి మహమూద్ అలీ వరకు వెళ్లింది… హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. ఇక, ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచి ఉండే సందర్భాలు ఉంటాయి… మరికొన్ని రాత్రి 11 గంటలకే మూత పడుతున్నాయి.. ఇంకా కొన్ని హోటల్స్ చాటుమాటుగా.. అర్ధరాత్రి వరకు బిర్యానీ, ఇతర విక్రయాలు కొనసాగిస్తూనే ఉంటాయి.. అయితే, అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్…
తెలంగాణ వ్యాప్తంగా ఆమ్నేషియా పబ్, అమ్మాయిపై సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. కావాాలనే కేసును పక్కదారి పట్టిండానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖులు పిల్లలు ఉండటంతో కేసులో నిందితుల పేర్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై, ఇటు పోలీసులపై ప్రతిపక్షాలు ఒత్తడి పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమ్మాయిపై…
ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగికదాడిలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు చేశారు. పబ్ లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి, వక్ఫ్ బోర్డు పెద్దమనిషి కొడుకు, ఓల్డ్ సిటీ ప్రముఖ పత్రికా డైరెక్టర్ కొడుకుతో పాటు హోం మంత్రి పీఏగా చెప్పుకుంటున్న హరి సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నారని.. కారు ఎవరిది,…
ఇటీవల బేగంబజార్లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి బంధువులు ఆమె భర్త నీరజ్ పన్వార్ అనే యువకుడిని అవమానం భారంతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరజ్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ హోం మంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మినిస్ట్ క్వార్టర్స్లో నీరజ్ భార్య సంజన మాట్లాడుతూ.. నా భర్తను హత్య చేసిన వారికి బెయిల్ రాకుండా చూడాలని కోరామని, నిందితులు అరెస్ట్ అయినప్పటికీ…
హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని టవర్లను, డేటా…
ఈరోజు బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారని, ఈ ప్రమాదం పై పోలీస్, జీహెచ్ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసామన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి గోదాముల పని చేస్తున్నారు అనే వివరాలు సేకరించాలని అదేశించామన ఆయన వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరామని,ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాముల ను గుర్తించాలని సూచించామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్హెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు. మధులత 2002 బ్యాచ్ కు చెందిన మహిళా సర్కిల్ ఇన్…
ఈరోజు మహిళా దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు అధికారులు. మొట్టమొదటిసారిగా మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించారు. మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సిఐ కి బాధ్యతలు అప్పగించనున్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్…