Ponnala Lakshmaiah: కేసీఆర్కి ఎన్నికల రోగం.. అందుకే డ్రామాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. అధికార పక్షం దూకుడు పెంచింది.. వచ్చే నెల నుంచి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు.. అయితే, ఈ విషయంపై స్పందించిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసిఆర్ ఎన్నికల రోగం వచ్చినట్లు ఉంది.. అందుకే డ్రామాలు, తమాషాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. పని చేస్తున్నట్లుగా రుజువు చేసుకోవడానికి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. యదాద్రి థర్మల్ విద్యుత్ చూసేందుకు కేసీఆర్ వెళ్లాడు.. ఒక ద్రోహంతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పలు చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Fraud: దీపం వత్తులు, బొట్టు బిళ్ళల పేరుతో మోసం.. రూ.200 కోట్లు కొట్టేశాడు..!
Also Read
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
ఇక, అసెంబ్లీలో గీతాలు గిసి కాళేశ్వరం మొదలు పెట్టాడు.. థర్మల్ విద్యుత్ కేంద్రం పునాది వేసి ఎన్నికల కోసం పవర్ ప్రాజెక్ట్ తెచ్చాం అని మధ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు పొన్నాల.. నాలుగు వేల మెగావాట్ల అంచనా.. ఇప్పటికే 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు బొగ్గు ఉన్న ప్రాంతంలో మొదలు పెట్టింది పక్కన పెట్టారని మండిపడ్డారు.. ఈ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్.. యూనిట్కి 9 రూపాయలకు పైగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నయాపైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఎంటీపీసీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నీ పొగరు బోతు తనం వల్ల కాళేశ్వరం. థర్మల్ ప్లాంట్ మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఛత్తీస్గఢ్ నుంచి కొనే కరెంట్ ఏ ధరకు కొంటున్నారో చెబుతావా? అని సవాల్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క యూనిట్ అయిన కరెంట్ ఉత్పత్తి చేశారా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో సోలార్ పవర్ కి ఉత్పాదక ప్రోత్సాహం ఇచ్చామని గుర్తుచేశారు. ఇరువై నాలుగు గంటల కరెంట్ రైతాంగానికి ఇవ్వడం లేదని దుయ్యబట్టిన ఆయన.. తొమ్మిది పది గంటలకు మించి బోర్లు నడవడంలేదన్నారు.. వనరులు ఉన్న దగ్గర కాకుండా లేని దగ్గర విద్యుత్ ఉత్పత్తి చేయడం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు పొన్నాల లక్ష్మయ్య.
ఎన్నికల ముందు మైనార్టీ, ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు.. బీసీలకు 33 నుంచి 23 శాతానికి కుదించిన నీచ చరిత్ర దేశంలో ఎక్కడా లేదంటూ విరుచుకుపడ్డారు పొన్నాల.. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం జాట్లకు రిజర్వేషన్ పెంచి 50 నుంచి 57 శాతానికి పెంచిందన్న ఆయన.. కర్ణాటకలో అక్టోబర్ 31న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచి 54 శాతానికి పెంచారని తెలిపారు.. కానీ, దేశంలో ఎక్కడ లేని విధంగా 88 శాతం బడుగు బలహీన వర్గాల వారు తెలంగాణలో ఉన్నారు.. కానీ, రిజర్వేషన్లు సరైన విధంగా లేవని విమర్శలు గుప్పించారు.. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.
తాజావార్తలు
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..