Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponnala Lakshmaiah Fires On Cm Kcr

Ponnala Lakshmaiah: కేసీఆర్‌కి ఎన్నికల రోగం.. అందుకే డ్రామాలు..!

Published Date :November 28, 2022 , 5:28 pm
By Sudhakar Ravula
Ponnala Lakshmaiah: కేసీఆర్‌కి ఎన్నికల రోగం.. అందుకే డ్రామాలు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. అధికార పక్షం దూకుడు పెంచింది.. వచ్చే నెల నుంచి టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు.. అయితే, ఈ విషయంపై స్పందించిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసిఆర్ ఎన్నికల రోగం వచ్చినట్లు ఉంది.. అందుకే డ్రామాలు, తమాషాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. పని చేస్తున్నట్లుగా రుజువు చేసుకోవడానికి కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. యదాద్రి థర్మల్ విద్యుత్ చూసేందుకు కేసీఆర్‌ వెళ్లాడు.. ఒక ద్రోహంతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పలు చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు.

Read Also: Fraud: దీపం వత్తులు, బొట్టు బిళ్ళల పేరుతో మోసం.. రూ.200 కోట్లు కొట్టేశాడు..!

Also Read

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
  • Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
  • PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
  • Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
Add as a preferred
source on google

ఇక, అసెంబ్లీలో గీతాలు గిసి కాళేశ్వరం మొదలు పెట్టాడు.. థర్మల్ విద్యుత్ కేంద్రం పునాది వేసి ఎన్నికల కోసం పవర్ ప్రాజెక్ట్ తెచ్చాం అని మధ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు పొన్నాల.. నాలుగు వేల మెగావాట్ల అంచనా.. ఇప్పటికే 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు బొగ్గు ఉన్న ప్రాంతంలో మొదలు పెట్టింది పక్కన పెట్టారని మండిపడ్డారు.. ఈ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్.. యూనిట్‌కి 9 రూపాయలకు పైగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నయాపైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఎంటీపీసీ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. నీ పొగరు బోతు తనం వల్ల కాళేశ్వరం. థర్మల్ ప్లాంట్ మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనే కరెంట్‌ ఏ ధరకు కొంటున్నారో చెబుతావా? అని సవాల్‌ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క యూనిట్ అయిన కరెంట్ ఉత్పత్తి చేశారా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో సోలార్ పవర్ కి ఉత్పాదక ప్రోత్సాహం ఇచ్చామని గుర్తుచేశారు. ఇరువై నాలుగు గంటల కరెంట్ రైతాంగానికి ఇవ్వడం లేదని దుయ్యబట్టిన ఆయన.. తొమ్మిది పది గంటలకు మించి బోర్లు నడవడంలేదన్నారు.. వనరులు ఉన్న దగ్గర కాకుండా లేని దగ్గర విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ఏంటి? అంటూ ఫైర్‌ అయ్యారు పొన్నాల లక్ష్మయ్య.

ఎన్నికల ముందు మైనార్టీ, ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు.. బీసీలకు 33 నుంచి 23 శాతానికి కుదించిన నీచ చరిత్ర దేశంలో ఎక్కడా లేదంటూ విరుచుకుపడ్డారు పొన్నాల.. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం జాట్లకు రిజర్వేషన్ పెంచి 50 నుంచి 57 శాతానికి పెంచిందన్న ఆయన.. కర్ణాటకలో అక్టోబర్ 31న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచి 54 శాతానికి పెంచారని తెలిపారు.. కానీ, దేశంలో ఎక్కడ లేని విధంగా 88 శాతం బడుగు బలహీన వర్గాల వారు తెలంగాణలో ఉన్నారు.. కానీ, రిజర్వేషన్లు సరైన విధంగా లేవని విమర్శలు గుప్పించారు.. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • congress
  • ponnala lakshmaiah
  • telangana
  • TRS

తాజావార్తలు

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

  • Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions