Prashant Kishor: పీకే చుట్టూ.. తెలంగాణ పాలిటిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోనూ ఏ నేత నోట విన్నా ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వస్తుంది.. ఆయన చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న, మొన్నా కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్ కాగా.. మరోవైపు ఢిల్లీలోనూ పీకే వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు జోరుగా సాగాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజేంటేషన్పై 8 మంది సభ్యులు… సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నివేదికపై కూలంకుషంగా చర్చించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎంపవర్డ్ ఆక్షన్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. మే 13, 14న, 15 తేదీల్లో మూడు రోజుల పాటు నవ సంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 400 మంది కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. వర్తమాన, సాంఘిక రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మైనార్టీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Read Also: Telangana: గూప్స్ పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానం ప్రకటన..
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
మరోవైపు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరికపై సోనియాకు నివేదిక సమర్పించింది… ప్రత్యేక కమిటీ. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై.. కమిటీతో చర్చించారు సోనియా గాంధీ. సోనియాతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భేటీ కానున్నారు. కాంగ్రెస్లో పీకే చేరిక, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై సోనియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్ అయ్యింది. గతంలో వీరిద్దరు సమావేశం అయినా ఇంతగా డిస్కషన్ జరగలేదు. ఓ వైపు కాంగ్రెస్లో చేరికపై అధిష్టానంతో చర్చలు జరుపుతూనే, మరోవైపు కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం.. కొత్త అనుమానాలు, చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా టీకాంగ్రెస్లో కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై చర్చలు జరిగాయని కొందరు, టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకే భేటీ అయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక, సీఎం కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ సమావేశంపై మాణిక్యం ఠాగూర్ పరోక్ష ట్వీట్లు చేశారు. శత్రువుతో స్నేహం చేసే వారిని నమ్మొద్దన్నారు. చిన్న అవకాశం ఉన్నంత కాలం… నమ్మకాన్ని కోల్పోనూ అంటూ గాంధీ చెప్పిన కొటేషన్ను ట్వీట్ చేశారు. ఠాగూర్ చేసిన ట్వీట్లు ఆసక్తిగా మారాయి.
తాజావార్తలు
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!