Amarula Yadulo: బండి సంజయ్కి పోలీసుల నోటీసులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో అనే సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ్మ, ఎల్లన్నని హయత్ నగర్ పోలీస్లు ఈ రోజు అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి బండి సంజయ్ కి 41A CRPC కింద హయత్ నగర్ పోలీస్లు నోటీసులు ఇచ్చారు.ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణను పోలీస్లు అరెస్ట్ చేశారు. అదే రోజు బెయిల్పై జిట్టా బాలకృష్ణ విడుదల అయ్యారు.
జూన్ 2 న అమరుల యాదులో.. బీజేపీ..
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
జూన్ 2న.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగోల్లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో పేరుతో బీజేపీ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఓ నాటకం ప్రదర్శించారు. కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాలన చూసి.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామా అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపాలని విరుచుకుపడ్డారు.
నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని.. మలిదశ ఉద్యమం చేపట్టి తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు. కేసీఆర్ కుట్రతో రాష్ట్రంలో కొత్త తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. శ్రీలంక తరహాలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి. కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, మోసాలపై బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో ప్రజలు భాగస్వాములై.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
Nithiin: నితిన్ ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?