PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM warangal tour: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు ఇక తెలంగాణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు రాబోతున్నారని బీజేపీ శ్రేణుల్లో సన్నాహాలు మొదలయ్యాయి. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండగా.. మరుసటి రోజు తెలంగాణకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాదిన పార్టీ విస్తరణకు కర్నాటకలో గెలుపు కీలకమని, అక్కడ ఓట్లు రాబట్టే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే వ్యూహంతో సరిహద్దుల్లో సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల కోడ్ సమస్య లేకుండా జహీరాబాద్, నారాయణపేట లేదా మరెక్కడైనా సభ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగించడంతోపాటు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనల ద్వారా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి వివిధ రంగాల్లో మంజూరైన నిధులు, ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఏప్రిల్ 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న కేంద్ర బలగాలు.. రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే బారత్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని 10వ ప్లాట్ఫాం నుంచి ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
Fake gang: సైబరాబాద్లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!