Fake gang: సైబరాబాద్లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake gang: రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ.. ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ సరుకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ స్వాధీనం చేసుకున్నారు.
Read also: KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఈ అక్రమార్కులు.. వెల్లుల్లిపాయల తొక్కను కూడా వదలడం లేదు. యంత్రాల్లో కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టు వేసి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పరిశ్రమలో అపరిశుభ్రత, వ్యర్థ జలాల వినియోగం, ప్రమాదకర రసాయనాలను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మేనేజర్ కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పరిశ్రమను నడుపుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈ నకిలీ దందా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లో విక్రయిస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యం ఇచ్చే కానుకలపై అధికారులు సైతం ఆశలు పెట్టుకుని కళ్లు బైర్లు కమ్మని పరిస్థితి. 500 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్ట్, హెవీ మ్యాంగో కూల్ డ్రింక్, ప్రమాదకర రసాయనాలు, మనుషులను చంపే వైట్ పౌడర్, 210 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 550 కిలోల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లు, టన్ను వెల్లుల్లి… స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
Hare Krishna Heritage: హరే కృష్ణ హెరిటేజ్ టవర్.. రేపు భూమిపూజ కార్యక్రమంలో సీఎం
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!