హిందూ సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తారు. సమస్త జీవకోటికి వెలుగునిచ్చే భాస్కరుడు జన్మించిన రోజునే రథ సప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే ఈ పండుగ చలికాలం ముగిసి, వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. 2026 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడు వస్తుంది, పూజకు అనువైన సమయాలు ఏమిటో తెలుసుకుందాం.
రథ సప్తమి 2026 తేదీ , శుభ ముహూర్తం
పండుగ విశిష్టత
రథ సప్తమి రోజున సూర్య భగవానుడు ఏడు గుర్రాలు పూన్చిన తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పండితులు చెబుతారు. ఆ ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని ఏడు రంగులకు , వారంలోని ఏడు రోజులకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు, సంపద , సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అరసవిల్లి వంటి సూర్య క్షేత్రాలలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
పూజా విధానం , సంప్రదాయాలు
ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ఆదిత్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే ఈ రథ సప్తమి, ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ.
Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు