Peanut Stuck: ప్రాణం మీదకు తెచ్చిన పల్లీ.. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుని ఆసుపత్రిలో చేరిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peanut Stuck: గొంతులో రూపాయి కాయిన్ ఇరుక్కుందనో, కొబ్బరి ముక్క ఇరుక్కుందనో మనం ఎక్కు సార్లు వింటుంటాము. కానీ ఇక్కడ ఆరెండు కాదండోయ్ ఒక చిన్ని పల్లీ ముక్క ఇరుక్కుని ఓ మహిళ నరకయాతన అనుభవించింది. పల్లీలు ఆరోగ్యానికి మంచిది అంటుంటారు అలాంటి అదే హాని కలిగిందంటే నమ్మలేని నిజం. ఓ మహిళ పల్లీలు ఒకపక్కనుంచి తింటూ ఉండగా అది కాస్త ఊపిరి తిత్తుల్లో వెళ్లి అడ్డం పడటంతో ఆమె ఊపిరి ఆడక ఆసుపత్రి పాలైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇది విన్న వారందరూ షాక్ కు గురవుతున్నారు. ఇంత చిన్న పల్లీ ముక్క ప్రాణాలమీదకు తెచ్చిందా అంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమి తినాలన్నా భయంతో జంకుతున్నారు.
Read also: Raviteja: ‘టైగర్ డెన్’ సెట్ వర్క్ గ్రాండ్ గా ఉంది…
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ఏం జరిగింది..
హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళకు రోజూ వేయించిన వేరుశెనగలు తినడం అలవాటు. అయితే కొద్ది రోజుల క్రితం వేరుశెనగ తింటుండగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆమె ఓ పక్కకి ఒరిగిపోయి మాటలు పల్లీలు తింటూ ఉండగా.. అది పొరపాటున ఊపిరితిత్తుల్లోని పై పొరల్లోకి వెళ్లిపోయింది.
అది గమనించిందో లేదో కానీ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే దగ్గు, జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడింది. వైద్యుడి వద్దకు వెళ్లగా.. న్యుమోనియాగా భావించి చికిత్స ప్రారంభించాడు. మందులు వాడుతున్నా ఈ లక్షణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విజయలక్ష్మి నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కిషన్ను సంప్రదించారు. ఆమె లక్షణాలు, మాట్లాడుతున్న తీరుపై అనుమానం వచ్చిన వైద్యుడు వెంటనే సీటీ స్కాన్ చేయగా అది బాగానే ఉంది. దీంతో ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మధ్య ఏదో ఇరుక్కుపోయిందని తేలింది. ఇది న్యుమోనియాకు దారితీసిందని నిర్ధారించారు. అలాగే ఉండిపోతే ప్రాణాలకే ప్రమాదం.అడ్డంకిని తొలగించడానికి బ్రోంకోస్కోపీ జరిగింది. కానీ అది వేరుశెనగ అని తేలడంతో డాక్టర్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే ఇలాగే చనిపోయే అవకాశం ఉందన్నారు.
Leo: ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!