CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
- రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్
- రూ.65 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం
- పరకాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.82 కోట్ల కేటాయింపు
- 100 పడకల ఆసుపత్రి సహా పలు నూతన భవనాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత కోలాహలంగా సాగింది. మంత్రులతో కలిసి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక పథకాలు , మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. పరకాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
విద్యా, రవాణా రంగాల్లో నూతన కాంతులు
విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ పరకాలలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీనితో పాటు నియోజకవర్గ యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణాన్ని ప్రతిపాదించారు. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే క్రమంలో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రూ.65 కోట్ల వ్యయంతో చేపట్టే నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు.
Also Read
మౌలిక వసతులు , మున్సిపల్ అభివృద్ధి
పరకాల మున్సిపాలిటీని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు రూ.82 కోట్లతో వివిధ పట్టణాభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణ ప్రాంత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.3 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ (DE) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక రంగానికి ప్రాధాన్యమిస్తూ రూ.5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులను, అక్కంపేట గ్రామంలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టే సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పనులను , ఆత్మకూర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద టౌన్షిప్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత , ఉపాధి అవకాశాలను పెంచే దిశగా దామెర మండలం ల్యాదేళ్ల వద్ద రూ.32.17 కోట్ల అంచనా వ్యయంతో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ డెయిరీ ప్లాంట్ ద్వారా స్థానిక మహిళలకు పాడి పరిశ్రమలో మెరుగైన ఆదాయ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నూతన భవనాలు
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల అనంతరం పూర్తయిన నూతన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరకాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు రూ.35 కోట్లతో నిర్మించిన అత్యాధునిక 100 పడకల ఏరియా ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు రూ.5 కోట్లతో పూర్తి చేసిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు, ఆత్మకూర్ ప్రాంతంలో రూ.1 కోటి వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన ఎస్పీఎం (SPM) సెంటర్ను కూడా ప్రారంభించారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!