NVSS Prabhakar: రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే.. నెలలో సీఎం రేవంత్ ఆరు సార్లు వెళ్ళారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar: ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారు.. రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విచారణ చేయిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. జలయజ్ఞo, ఇందిరమ్మ ఇండ్ల అంశంలో అవినీతిని బయట పెడతామని కేసీఆర్ ప్రకటించారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో గత కాంగ్రెస్ పాలనపై ఎలాంటి విచారణ చేపట్టలేదని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం కేసీఆర్ తరహాలోనే కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక కెసిఆర్ పాలనపై విచారణ చేపడతామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదన్నారు. ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారని, రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే రేవంత్ డిల్లీ నుంచి పాలన కొనసాగిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
Read also: New Zealand Ex PM: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలానే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో బస్సులు రాక, బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేషన్ కార్డ్ తొలిగించిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉచిత ప్రయాణం హామికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రంలో 850 కి పైన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.. అధికారులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం లేదని తెలిపారు. బస్సులు లేక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినిలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 15000 కోట్ల అప్పు కోసం మొదటి నెలలోనే రేవంత్ ప్రభుత్వం పాకులాడిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెపట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీకి బీఅర్ఎస్ బీటీమ్ కాదని కేటీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్, బీఅర్ఎస్ ఒక్కటే అనడానికి కేటీఆర్ మాటలే నిదర్శనమన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.
New Zealand Ex PM: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!