NVSS Prabhakar: రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే.. నెలలో సీఎం రేవంత్ ఆరు సార్లు వెళ్ళారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar: ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారు.. రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విచారణ చేయిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. జలయజ్ఞo, ఇందిరమ్మ ఇండ్ల అంశంలో అవినీతిని బయట పెడతామని కేసీఆర్ ప్రకటించారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో గత కాంగ్రెస్ పాలనపై ఎలాంటి విచారణ చేపట్టలేదని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం కేసీఆర్ తరహాలోనే కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక కెసిఆర్ పాలనపై విచారణ చేపడతామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదన్నారు. ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారని, రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే రేవంత్ డిల్లీ నుంచి పాలన కొనసాగిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
Read also: New Zealand Ex PM: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలానే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో బస్సులు రాక, బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేషన్ కార్డ్ తొలిగించిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉచిత ప్రయాణం హామికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రంలో 850 కి పైన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.. అధికారులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం లేదని తెలిపారు. బస్సులు లేక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినిలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 15000 కోట్ల అప్పు కోసం మొదటి నెలలోనే రేవంత్ ప్రభుత్వం పాకులాడిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెపట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీకి బీఅర్ఎస్ బీటీమ్ కాదని కేటీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్, బీఅర్ఎస్ ఒక్కటే అనడానికి కేటీఆర్ మాటలే నిదర్శనమన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.
New Zealand Ex PM: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని
తాజావార్తలు
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!