NTR Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం.. హైదరాబాద్లో ఎక్కడ అమ్ముతారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Coin: తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు. సినీ నటుడిగా అగ్రగామిగా ఉన్న ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించిన అతి కొద్ది మందిలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన శతజయంతి వేడుకల సందర్భంగా… నిన్న (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంద రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. నందమూరి కుటుంబసభ్యుల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నాణెం 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేయబడింది. దేశంలోని ప్రముఖుల సేవలకు గుర్తుగా ఈ నాణేలను విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ.. ఇతరుల స్మారక నాణేలను విడుదల చేసింది. ప్రత్యేక సందర్భాలలో గుర్తుగా RBI ఈ ప్రత్యేక నాణేలను విడుదల చేస్తుంది.
Read also: RK Selvamani: మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్..
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
- Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
తాజాగా ఎన్టీఆర్ సినిమాతో నాణెం విడుదల కావడంతో చాలా మంది తెలుగు వారు దీన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణెం ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నాణేలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తోంది. ఎన్టీఆర్ నాణెంతో సహా స్మారక నాణేలను www.indiagovtmint.in వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎన్టీఆర్ స్మారక నాణేలను నేటి నుంచి ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ.4850గా నిర్ణయించారు. ఈ నాణేలు పసుపు, గోధుమ రంగులలో లభిస్తాయి. ఈ వెబ్సైట్లో ఎన్టీఆర్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్లుప్తంగా వ్రాయబడ్డాయి. ఈ సైట్లో బంగారం, వెండి నాణేలు కూడా అమ్ముడవుతాయి. హైదరాబాద్లో కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా సైఫాబాద్లోని మింట్ సేల్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. చర్లపల్లిలోని ఐజీ మింట్ సేల్ కౌంటర్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం దాదాపు రూ.5 వేలు? అని ఆశ్చర్యపోతున్నారా..? అధిక ధర ఉన్నప్పటికీ, అన్నగారిని అభిమానించే చాలా మంది ఈ నాణేన్ని కొనుగోలు చేస్తారనడంలో సందేహం లేదు.
Supreme Court: ఆర్టికల్ 370పై విచారణ.. జమ్మూ కాశ్మీర్లో ప్రజల ప్రాథమిక హక్కులను హరించిందన్న సుప్రీంకోర్టు
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!