NTR Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం.. హైదరాబాద్లో ఎక్కడ అమ్ముతారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Coin: తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు. సినీ నటుడిగా అగ్రగామిగా ఉన్న ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించిన అతి కొద్ది మందిలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన శతజయంతి వేడుకల సందర్భంగా… నిన్న (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంద రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. నందమూరి కుటుంబసభ్యుల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నాణెం 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేయబడింది. దేశంలోని ప్రముఖుల సేవలకు గుర్తుగా ఈ నాణేలను విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ.. ఇతరుల స్మారక నాణేలను విడుదల చేసింది. ప్రత్యేక సందర్భాలలో గుర్తుగా RBI ఈ ప్రత్యేక నాణేలను విడుదల చేస్తుంది.
Read also: RK Selvamani: మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్..
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
తాజాగా ఎన్టీఆర్ సినిమాతో నాణెం విడుదల కావడంతో చాలా మంది తెలుగు వారు దీన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణెం ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నాణేలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తోంది. ఎన్టీఆర్ నాణెంతో సహా స్మారక నాణేలను www.indiagovtmint.in వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎన్టీఆర్ స్మారక నాణేలను నేటి నుంచి ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ.4850గా నిర్ణయించారు. ఈ నాణేలు పసుపు, గోధుమ రంగులలో లభిస్తాయి. ఈ వెబ్సైట్లో ఎన్టీఆర్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్లుప్తంగా వ్రాయబడ్డాయి. ఈ సైట్లో బంగారం, వెండి నాణేలు కూడా అమ్ముడవుతాయి. హైదరాబాద్లో కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా సైఫాబాద్లోని మింట్ సేల్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. చర్లపల్లిలోని ఐజీ మింట్ సేల్ కౌంటర్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం దాదాపు రూ.5 వేలు? అని ఆశ్చర్యపోతున్నారా..? అధిక ధర ఉన్నప్పటికీ, అన్నగారిని అభిమానించే చాలా మంది ఈ నాణేన్ని కొనుగోలు చేస్తారనడంలో సందేహం లేదు.
Supreme Court: ఆర్టికల్ 370పై విచారణ.. జమ్మూ కాశ్మీర్లో ప్రజల ప్రాథమిక హక్కులను హరించిందన్న సుప్రీంకోర్టు
తాజావార్తలు
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!