PM MODI: తెలంగాణలో ఒక కుటుంబం.. ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందూరు ప్రజా గర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన తానే చేశానన్నారు. NTPC ప్లాంట్ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. నిజామాబాద్ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తనకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: PM MODI: NDAలో చేరుతానని కేసీఆర్ నన్ను అడిగారు.. సీక్రెట్స్ బయటపెట్టిన ప్రధాని!
Also Read
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. INDIA కూటమి, కాంగ్రెస్.. మహిళా బిల్లు పాస్ కాకుండా కుట్రలు చేసేవారని ప్రధాని ఆరోపించారు. మహిళా బిల్లుకు మద్దతు అని బయటకు చెబుతూ, లోపల కుట్రలు చేసేవారని మండిపడ్డారు. దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే తాను మహిళా బిల్లును పాస్ చేయగలిగానని తెలిపారు. ఇక తెలంగాణను నిజాం నుంచి సర్దార్ పటేల్ విముక్తి కల్పించారని.. ఇప్పుడు మరో గుజరాతీ.. తెలంగాణ సమృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు దేశ అభివృద్ధిలో తెలంగాణ తన సహకారం ఉందని.. తెలంగాణనే కరోనాకి వాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ కోసం కేంద్రం భారీగా నిధులు ఇస్తే.. బీఆర్ఎస్ వాటిని లూటీ చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ లూటీస్వామ్యంగా మార్చేశారని ప్రధాని మండిపడ్డారు. తెలంగాణలో ఒక కుటుంబం.. ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసిందని తెలిపారు. కుటుంబ పాలనతో అంతా తమ వారికే లబ్ధి కలిగేలా చూసుకుంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రధాని మోడీ అన్నారు.
- Tags
- bjp
- BRS Government
- kcr
- modi
- telugu news
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!