Bus Booking: ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. పెళ్లిళ్ల కోసం బస్ బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్..
- ఆర్మూర్ డిపో మేనేజర్ పి.రవికుమార్ కీలక ప్రకటన..
- పెళ్లిళ్లు-ఇతర వేడుకలకు బస్సు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ..
- ఈ ఆఫర్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వాసులకు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Booking: శ్రావణమాసం అంటే శుభప్రదమైన మాసం. ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశాలు జరుగుతాయి. అయితే ఈ వేడుకకు దూర ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులను తీసుకురావడం కష్టమైన పని. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులో రాయితీలను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వాసులకు మాత్రమే నండోయ్ గమనించగలరు అంటూ కూడా తెలిపింది. ఈ మేరకు ఆర్మూర్ డిపో మేనేజర్ పి.రవికుమార్ కీలక ప్రకటన చేశారు.
Read also: Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి
Also Read
పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు బస్సు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా బస్సు బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలా బస్ బుక్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని అన్నారు. ఏప్రిల్, మే తర్వాత పెళ్లిళ్లకు దాదాపు రెండు నెలల గ్యాప్ వచ్చింది. శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడే కాకుండా.. గృహ ప్రవేశాలు , ఇతర వేడుకలు కూడా నిర్వహిస్తారు. కానీ కొన్నిసార్లు కుటుంబం మొత్తం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో హడావుడిగా ప్రయాణం చేయడం వలన చాలా మంది అలసిపోతుంటారు. అంతే కాకుండా.. అప్పటి కప్పుడు కార్లు, ట్రాలీ వాహనాలు బుక్ చేసుకుని కంగారు పడుతూ బయలుదేరుతు అనుకోని ప్రమాదాలకు గురవుతుంటారు. మీరు సాఫీగా ఆనందంగా వెళ్లేందుకు ఈ బస్సును బుక్ చేసుకోవడం వల్ల ఆ శ్రమ తగ్గుతుంది. మీరు కూడా హాయిగా ప్రయాణం చేయవచ్చంటూ తెలిపారు.
KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?