Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Student Passed Away In Peddapur Gurukula School

Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి

Published Date :August 9, 2024 , 1:15 pm
By Bhanu
  • పెద్దాపూర్ గురుకుల పాటశాలలో విద్యార్థుల వరుస మరణాల కలకలం..
  • నిన్న రాత్రి ముగ్గురు విద్యార్థులకు ఆస్వస్థత-ఒకరు మృతి- ఇద్దరి పరిస్థితి విషమం..
Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagtial Crime: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10 రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన అనిరుధ్, మోక్షిత్ అనే ఇద్దరు విద్యార్థులు ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి విద్యార్థుల సమాచారం మేరకు హాస్టల్ సిబ్బంది వారిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పది రోజుల వ్యవధిలో ఇద్దరి బాలురు మృతి చెందడంతో పిల్లల తల్లి దండ్రులు ఆందోళనల చెందుతున్నారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. గురుకులాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణ చేశారు.

Also Read

  • KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
  • KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
  • KCR: బీఆర్‌ఎస్ జనరల్‌ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్‌
  • Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

Read also: KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..

అయితే పెద్దపూర్ గురుకుల పాఠశాల హాస్టల్‌లో జూలై 27న మరో ఘటన చోటుచేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థులను పాము కాటేయడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వారి పక్కనే నిద్రిస్తున్న మరో బాలుడు శవమై కనిపించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి మెట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్, ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడెపు గణేష్ వసతి గృహంలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వీరిని పాము కాటు వేసింది. అయితే తమను ఏదో పురుగు కుట్టిందని భావించి వాళ్లు అలాగే పడుకున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వచ్చి నీళ్లు, ఆహారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. వీరిని 6 గంటలకు మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు పాము కాటుకు గురైనట్లు గుర్తించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరపేట గ్రామానికి చెందిన గణాదిత్యా అనే విద్యార్థి పాముకాటుతో మృతి చెందాడు. అయితే అస్వస్థతకు గురైన తమ పిల్లలకు తక్షణ వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రిన్సిపాల్‌, కేర్‌ టేకర్‌పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dog Attack: కుక్కల దాడిలో మా బాబు చనిపోయాడు.. ప్రభుత్వం చర్యలు తీసుకోదా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • metpalli mandal
  • One more Student passed away in Peddapur Gurukula School
  • Peddapur Gurukula School
  • students of Peddapur Gurukula School

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions