KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
- హైదరాబాద్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ ..
- గోదావరి నీళ్ళు డెడ్ స్టోరేజ్ కి చేరి హైదరాబాద్ కి అందకపోయినా ఈ నీళ్ళు సరిపోయేలా ఏర్పాట్లు..
- హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల రాష్ట్ర ప్రజలకు తీరని లోటు ఏర్పడిందన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదలైన రోజుల్లో నల్లగొండ జిల్లా రైతులు అడ్డుకుని పోరాటం చేశారన్నారు. ఆ తరువాత చంద్ర బాబు నాయుడు ప్రభుత్వంలో హైదరాబాద్ కి త్రాగునీరు అందించాలని ఎలిమినేటి మాధవ రెడ్డి పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారని తెలిపారు. అప్పుడు కూడా రైతులు అడ్డుకున్నారని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న నగరం.. హైదరాబాద్ కి మంచి నీటి అవసరాలు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగు నీటి కి కావాల్సిన ప్రాజెక్ట్ లు అందించారు. ఆ తరువాత సుంకిశాల అంశాన్ని తీసుకుని తిరిగి ప్రారంభించారన్నారు.
Read also: Dog Attack: కుక్కల దాడిలో మా బాబు చనిపోయాడు.. ప్రభుత్వం చర్యలు తీసుకోదా..?
Also Read
సాగునీటి కి అడ్డులేకపోవడం చేత ఈ సారి రైతులు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. హైదరాబాద్ అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్ట్ స్వయంగా వెళ్లి ఫౌండేషన్ వేసాము. గోదావరి నీళ్ళు డెడ్ స్టోరేజ్ కి చేరి హైదరాబాద్ కి అందకపోయినా ఈ నీళ్ళు సరిపోయేలా ఏర్పాట్లు చేశాం. డిల్లీలో ముంబైలో బెంగుళూర్ లో నీళ్ళ కోసం ట్యాంకర్ల పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి లేకుండా చేశాము. మరి యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారు. సీతారామ ప్రజెక్ట్ కూడా కేసీఆర్ నిర్మించారు. కానీ మా ప్రభుత్వం పోయింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వారే నిర్మించినట్లు ప్రారంభించారు. మొన్నటి ఎండా కాలంలో హైదరబాద్ లో నీటి సమస్య తలెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2000 రూపాయలకు ట్యాంకర్లు అందించారు.
Read also: Jagga Reddy: నేటి పాలకులు కులం,మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు
కేసీఆర్ హయంలో ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తే రేవంత్ రెడ్డి 2 వేలకు ట్యాంకర్లు అమ్ముతున్నాడు అని ప్రజలు విమర్శించారు. సోషల్ మీడియా లో వచ్చేంత వరకు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ప్రాజెక్ట్ నిర్మించే సంస్థ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ రోజు సుంకిశాల ప్రాజెక్ట్ విజిటింగ్ కి వెళ్తున్నారన్నారు. అక్కడి నుండే నిజం నిగ్గు తెలే వరకు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ డ్యామేజ్ పై జుడీషియరి ఎంక్వైరీ జరిపించాలన్నారు. మేడి గడ్డ కూలినప్పుడు కేంద్ర సంస్థలు వెంటనే స్పందించాయి. ఇప్పుడు మాత్రం కేంద్ర సంస్థలు స్పందించకపోవడం చూస్తే ఇద్దరు ఒక్కటే అని మరోసారి అర్థం అవుతుంది. ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం. అహంకారంతో ముఖ్యమంత్రి ఉన్నాడు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని వాళ్ళు మోయలేకపోతున్నారు. పరిపాలన మీద రేవంత్ రెడ్డి కి పట్టు లేదన్నారు.
Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్ ఏమైనట్టు..?
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!