MLA Seethakka: ములుగును టార్గెట్ చేస్తున్నారు.. కేటీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే సీతక్క కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Comments on KTR Mulugu Tour: మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమని.. కానీ ములుగు జిల్లాకు గోదావరి జలాలు రావట్లేదని దుయ్యబట్టారు. గోదావరి జలాల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఏటూరునాగారంను రెవిన్యూ డివిజన్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని.. మెడికల్ కాలేజీ పనులు ప్రారంభం కాలేదని.. మల్లంపల్లిపి మండల కేంద్రం చేస్తామని కూడా హామీ ఇవ్వలేదని విమర్శించారు. ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Errabelli Dayakar Rao: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారు
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
రాజకీయం అంటే సేవ చేయడం అనేది తన అభిప్రాయమన్న సీతక్క.. తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. డబ్బు, అధికారం ఉందని ఏదైనా చేయొచ్చని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భుకాబ్జాలకు పాల్పడేవారు, సెటిల్మెంట్లు చేసే వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసే తనను ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ పూర్తిగా వెనుకబడ్డ రాష్ట్రమని.. అలాంటి రాష్ట్రాన్ని తెలంగాణతో ఎలా పోలుస్తారని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అనేది అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసే తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ను కలిసే అవకాశం ఉండదని, అందుకే తాను మంత్రి కేటీఆర్కు వినతి పత్రం ఇచ్చానని చెప్పుకొచ్చారు.
Gangster Shot Dead: ఉత్తర్ప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..
కాగా.. ములుగు జిల్లా పర్యటనకు కేటీఆర్ రావడంతో, ములుగు కలెక్టరేట్ వద్ద సీతక్క ఆయన్ను కలిసి వినతి పత్రం అందించారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చేలా రామప్ప నుంచి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని.. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలని అందులో కోరారు. అలాగే.. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేయాలని, మూతపడ్డ బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించాలని, మల్లంపల్లి – లక్ష్మీదేవిపేట – రాజుపేటల్ని మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!