MLA Seethakka: ములుగును టార్గెట్ చేస్తున్నారు.. కేటీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే సీతక్క కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Comments on KTR Mulugu Tour: మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమని.. కానీ ములుగు జిల్లాకు గోదావరి జలాలు రావట్లేదని దుయ్యబట్టారు. గోదావరి జలాల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఏటూరునాగారంను రెవిన్యూ డివిజన్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని.. మెడికల్ కాలేజీ పనులు ప్రారంభం కాలేదని.. మల్లంపల్లిపి మండల కేంద్రం చేస్తామని కూడా హామీ ఇవ్వలేదని విమర్శించారు. ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Errabelli Dayakar Rao: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారు
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
రాజకీయం అంటే సేవ చేయడం అనేది తన అభిప్రాయమన్న సీతక్క.. తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. డబ్బు, అధికారం ఉందని ఏదైనా చేయొచ్చని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భుకాబ్జాలకు పాల్పడేవారు, సెటిల్మెంట్లు చేసే వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసే తనను ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ పూర్తిగా వెనుకబడ్డ రాష్ట్రమని.. అలాంటి రాష్ట్రాన్ని తెలంగాణతో ఎలా పోలుస్తారని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అనేది అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసే తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ను కలిసే అవకాశం ఉండదని, అందుకే తాను మంత్రి కేటీఆర్కు వినతి పత్రం ఇచ్చానని చెప్పుకొచ్చారు.
Gangster Shot Dead: ఉత్తర్ప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..
కాగా.. ములుగు జిల్లా పర్యటనకు కేటీఆర్ రావడంతో, ములుగు కలెక్టరేట్ వద్ద సీతక్క ఆయన్ను కలిసి వినతి పత్రం అందించారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చేలా రామప్ప నుంచి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని.. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలని అందులో కోరారు. అలాగే.. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేయాలని, మూతపడ్డ బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించాలని, మల్లంపల్లి – లక్ష్మీదేవిపేట – రాజుపేటల్ని మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!