Errabelli Dayakar Rao: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao Fires On Congress Party Mulugu Sabha: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. 75 ఏళ్లు అధికారంలో ఉండి కూడా.. ములుగులో తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవం సభలో కేటీఆర్తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ములుగు అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ములుగు ఏజెన్సీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు ములుగుని జిల్లా చేసి, అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని అన్నారు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో కరెంట్, మంచి నీళ్ళు ఉండవని.. తెలంగాణలో ఉచిత కరెంట్, ఇంటింటికి మంచినీరు ఇస్తున్నామని చెప్పారు. మేడారం జాతరను రాష్ట్ర పండగ చేసి, కోట్ల నిధులు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు భీమా, రైతు బందు, ఉచిత కరెంట్ ఇచ్చి.. ఆ తర్వాతే మాట్లాడాలని సవాల్ చేశారు. ములుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా.. 30 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
Minister KTR: తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని కేసీఆర్ నిరూపించారు
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
అనంతరం మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణ అభివృద్ధిని స్టడీ చేయడానికి వస్తున్నారన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. సీఎం కేసిఆర్ చొరవతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారిందని తెలిపారు. ఇదే సమయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మేడారం జాతరకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మేడారం జాతరను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరెంట్ లేని ఏజెన్సీ గూడెం ప్రాంతాలకు కరెంట్ అందించామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు మంచినీరు అందిస్తున్నామని.. 300 పడకల ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చామని తెలియజేశారు. మారుమూల గ్రామాలకు వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్న ఆమె.. అభివృద్ధికి చిరునామాగా ములుగు జిల్లా మారిందని చెప్పుకొచ్చారు.
Ashish Vidyarthi: ఛీఛీ.. ముసలోడు.. రెండో పెళ్లి అంటున్నారు.. చేసుకుంటే తప్పేంటి
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..