Gangster Shot Dead: ఉత్తర్ప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangster Shot Dead: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్స్టర్ హత్య జరిగింది. మాఫియాడాన్, గ్యాంగ్ స్టర్, ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిని సంజీవ్ మహేశ్వీరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ముజఫర్నగర్కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా, సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ్సింగ్లకు జీవిత ఖైదు పడింది. జీవాకు మరో నాలుగు హత్యలతో సంబంధం ఉంది.
Read Also: Speaker Pocharam: కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారు- స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
కృష్ణానంద్ రాయ్ హత్యలో అన్సారీ సోదరులు( సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ)లతో పాటు సంజీవ్ జీవా, ఎజాజ్ అన్సారీ, రాయ్ బరేలీకి చెంది ఫిర్దౌస్, మున్నా బజరంగీ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. ఈ కేసులోనే జీవాను పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. లాయర్ వేషంలో వచ్చిన వ్యక్తి, జీవాపై కాల్పులు జరిగి చంపేశాడు. ప్రస్తుతం కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మరో వ్యక్తికి కూడా గాయాలు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ట్రామా సెంటర్ కు లక్నో పోలీసులు తరలించారు. జీవాపై మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి.
ఈ ఘటనపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. లక్నో ‘రక్షణ లేని నగరాల’ జాబితాలో చేరిందని, నగరంలో మహిళలకు భద్రత లేదని ఆయన అన్నారు. లక్నోలో నేరాల పెరుగుదలపై ఆయన పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలోనే ప్రజలు హత్యలకు గురవుతున్నారని, లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడిని దుండగులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!