తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, సస్పెండ్ అయిన మేము హైకోర్టు కి వెళ్ళామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. సస్పెండ్ కి కారణాలు ఏంటి అని రాత పూర్వకంగా హామీ ఆడిగాం ఇంత వరకు ఇవ్వలేదని, స్పీకర్ ఉండే విస్తృత అధికారుల పేరుతో మమ్మల్ని ఆరోజు బయటకు పంపించారన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసులు ఇవ్వండి అని హైకోర్టు చెప్పిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి అసెంబ్లీ సెక్రెటరీ సిద్ధంగా లేరన్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పాసుల ఉన్న మా పీఏ ని 3 గంటల పాటు బయటే ఉంచారని, కోర్టు మేము వేసిన పిటిషన్ను కొట్టి వేసిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ కాపీని తీసుకొనప్పుడు ఆ సెక్రెటరీ ని పిలిపించి మాకు న్యాయం చేయాల్సింది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు కి వెళ్తామని భయపడి ఆర్డర్ కాపీ లు అడ్డుకున్నారు.. సస్పెండ్ చేసిన ఆర్డర్ కాపీ ఇవ్వలేదు..కేసు కొట్టి వేసిన జడ్జి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు…మేము ఎవరికి చెప్పాలి ప్రజలు గమనించాలన్నారు. మంగళవారం తరువాత మీరు ఉత్తర్వులు ఇస్తే మాకు న్యాయం జరుగదని, నిన్న సీఎస్ కేసు హైకోర్టు కి వచ్చింది.. ఐఏఎస్ ,ఐపీఎస్ ల విషయంలో క్యాట్, హైకోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు. సోమేశ్ కుమార్ తెలంగాణ కు కేటాయించలేదు..ఆయన ను ఆంద్రప్రదేశ్ కి కేటాయిస్తే తెలంగాణ కు సీఎస్ అయ్యారన్నారు.