Smart Ration Cards : గుడ్న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
- ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం
- 1.05 కోట్ల రేషన్ కార్డులు.. 3.42 కోట్ల మందికి లబ్ధి
- వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు
- పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Ration Cards : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రాబోయే ఆగస్టు 15న వైభవంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఒకేసారి ఈ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఈ కొత్త కార్డుల మంజూరుతో రాష్ట్రంలో ఆహార భద్రత పరిధి మరింత విస్తరించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా, అదనంగా 61.09 లక్షల మంది లబ్ధిదారులు ఈ పరిధిలోకి వచ్చారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరి, దాదాపు 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత లభిస్తోంది. దీనికి అనుగుణంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది.
ఈ భారీ పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేందుకు కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాల్లో పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటూ, ముందుగానే లబ్ధిదారుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెళ్లను సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , స్థానిక ప్రజాప్రతినిధులందరినీ ఇందులో భాగస్వాములను చేస్తూ, ఈ ప్రక్రియ ప్రతిరోజూ సక్రమంగా జరిగేలా సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించి పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!