Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..
- వైభవంగా ముగిసిన మేడారం మహాజాతర
- కోట్లాది భక్తుల రాక.. అంచనాలకు మించిన సందడి
- విష ప్రచారాలపై మండిపడ్డ మంత్రి
- ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ.. గోదావరి పుష్కరాలపై సమీక్ష
మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ‘తిరుగు జాతర’ నిర్వహణతో ఈ వేడుకలు పూర్తిస్థాయిలో ముగుస్తాయని వెల్లడించారు.
India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్పై కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
జాతర ఏర్పాట్లపై కొంతమంది కావాలనే విష ప్రచారం చేశారని సీతక్క మండిపడ్డారు. ముఖ్యంగా ఒక చిన్న దొంగతనం ఘటనను భూతద్దంలో చూపిస్తూ, జాతర ఏర్పాట్లు విఫలమయ్యాయనే రీతిలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులను గమనించిన ప్రతిపక్ష నాయకులు సైతం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించడం సంతోషకరమని ఆమె అన్నారు. జాతరలో మంత్రి సీతక్క చేసిన నృత్యంపై వచ్చిన వ్యాఖ్యలకు ఆమె దీటుగా సమాధానమిచ్చారు. “మా ఆదివాసీ సంస్కృతిలో నృత్యం అనేది ఒక భాగం. విదేశాల నుంచి వచ్చే వారు కూడా మా నృత్యాలను ఇష్టపడి చేస్తున్నారు. అలాంటప్పుడు మా సొంత గడ్డపై, మా సంస్కృతిలో భాగంగా నేను నృత్యం చేయడంలో తప్పేముంది?” అని ప్రశ్నించారు.
ఇది తన మూలాలకు, ప్రజలకు ఇచ్చే గౌరవమని స్పష్టం చేశారు. వచ్చే జాతర నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మేడారం చుట్టుపక్కల ఉన్న రోడ్లను వెడల్పు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల గురించి ములుగు జిల్లా పరిధిలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
-
US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!