Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..
- వైభవంగా ముగిసిన మేడారం మహాజాతర
- కోట్లాది భక్తుల రాక.. అంచనాలకు మించిన సందడి
- విష ప్రచారాలపై మండిపడ్డ మంత్రి
- ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ.. గోదావరి పుష్కరాలపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ‘తిరుగు జాతర’ నిర్వహణతో ఈ వేడుకలు పూర్తిస్థాయిలో ముగుస్తాయని వెల్లడించారు.
India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్పై కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
జాతర ఏర్పాట్లపై కొంతమంది కావాలనే విష ప్రచారం చేశారని సీతక్క మండిపడ్డారు. ముఖ్యంగా ఒక చిన్న దొంగతనం ఘటనను భూతద్దంలో చూపిస్తూ, జాతర ఏర్పాట్లు విఫలమయ్యాయనే రీతిలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులను గమనించిన ప్రతిపక్ష నాయకులు సైతం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించడం సంతోషకరమని ఆమె అన్నారు. జాతరలో మంత్రి సీతక్క చేసిన నృత్యంపై వచ్చిన వ్యాఖ్యలకు ఆమె దీటుగా సమాధానమిచ్చారు. “మా ఆదివాసీ సంస్కృతిలో నృత్యం అనేది ఒక భాగం. విదేశాల నుంచి వచ్చే వారు కూడా మా నృత్యాలను ఇష్టపడి చేస్తున్నారు. అలాంటప్పుడు మా సొంత గడ్డపై, మా సంస్కృతిలో భాగంగా నేను నృత్యం చేయడంలో తప్పేముంది?” అని ప్రశ్నించారు.
ఇది తన మూలాలకు, ప్రజలకు ఇచ్చే గౌరవమని స్పష్టం చేశారు. వచ్చే జాతర నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మేడారం చుట్టుపక్కల ఉన్న రోడ్లను వెడల్పు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల గురించి ములుగు జిల్లా పరిధిలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..