Mallareddy: ఐటీ విచారణకు మల్లారెడ్డి దూరం.. ఐటీ వదిలిన మీడియా వదలట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MallaReddy IT Raids: ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. మల్లారెడ్డితో పాటు 16 మంది నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఐటీ ముందు 15 మంది హాజరు కానున్నారు. మహెందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తి రెర్డి, మల్లారెడ్డి పెద్ద కోడలు, రాజశేఖర్ రెడ్డి, శ్రేయరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి, ప్రవీణ్ రెడ్ది, సంతోష్ రెడ్డి, త్రీశూల్ రెడ్డి, నర్సింహ్మ యాదవ్, జై కిషన్, రాజేశ్వర్ రావు, ఇద్దరు ప్రిన్సిపాల్స్ విచారణకు హజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఐటీ విచారణకు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి బయలు దేరారు. నోటీసుల్లో హాజరవ్వాలని మాత్రమే ఉందని, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు తీసుకురావాలని అధికారులు చెప్పలేదని, ఐటీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఐటీ ముందుకు మంత్రి రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఐటీ ముందుకు హాజరు కావట్లేదని స్పష్టం చేశారు. నేడు ఇంటి నుంచి ఓ పోగ్రామ్ కు మెడ్చేల్ కు వెళ్లిపోయారు మంత్రి. నన్ను ఐటీ వదిలేసింది కానీ, మీడియా వదలట్లేదని మంత్రి అన్నారు. మా కుటుంబం ఐటీ ముందు హాజరవుతారని పేర్కొన్నారు.
Read also: Varisu: తన సినిమాకే ఎక్కువ థియేటర్స్ వస్తాయంటున్న దిల్ రాజు
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
గత వారం బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 48 గంటలపాటు మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు ఐటీ నిర్వహించింది. రూ.100 కోట్ల డొనేషన్లు వసూలు చేశారని ఆరోపణలతో ఐటీ సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇల్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది. రెండు రోజులు పాటు మంత్రి మల్లా రెడ్డి తో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళు, కాలేజీలలో కొనసాగిన ఐటీ సోదాలు చేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో లభ్యమైన 3 కోట్ల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో 18కోట్ల 50లక్షల నగదు,15 కిలోల బంగారం, కీలక పత్రాలను అధికారులు సీజ్ చేశారు. దీనిపై నేటి విచారణలో ప్రశ్నించనున్నారు ఐటీ అధికారులు. ఈ దాడులపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ విచారణకు సహకరిస్తానని తెలిపారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!