KTR: కాంగ్రెస్- బీజేపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు..
రాజన్న సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు. నేతన్న ఆత్మహత్య వద్దంటూ రాతలు సిరిసిల్ల గోడలపై ఉండేవి.. సిరిసిల్లలో ఇన్ని విద్యాసంస్థలు వస్తాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరు సిరిసిల్ల, గజ్వేల్ లోనే అభివృద్ధి అంటుంటే, సిరిసిల్ల నాయకులు మాత్రం సిరిసిల్లలో అభివృద్ధి ఏం లేదని అంటున్నారు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Read Also: MS Dhoni: రిటైర్మెంట్పై హింట్ ఇచ్చిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ.. 2024లో ఐపీఎల్ ఆడతాడా?
Also Read
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
కేసీఆర్ న్యాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నాం.. సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధి ని సాదిస్తున్నాం.. కాంగ్రెస్- బీజెపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే.. కుల, మతాల పేరుతో ముందుకు వస్తారని ఆయన మండిపడ్డారు. కులం, మతం కాదు గుణం చూసి ఓటెయ్యండి.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం.. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి.. సిరిసిల్ల చరిత్రలో మొదటి సారి 2014 సిరిసిల్ల ఎమ్మెల్యే కు మంత్రి పదవి వచ్చింది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: MK Stalin: గవర్నర్ని మార్చొద్దు, మాకు ఉపయోగపడుతున్నాడు.. ప్రధానిపై స్టాలిన్ విమర్శలు.
ఇంతకష్టపడి సాదించుకుని.. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతుండట, మెడమీద తల ఉన్నోడు ఎవడైనా ఇతడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతాడని గాంధీ ఆనాడే ఊహించాడు.. కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చారు.. కానీ, ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు.. 55 ఏండ్లలో చేతకాలేదు కానీ, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రూపాయల డిజీల్ 100 రూపాయలు, 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు దేవుడా నరేంద్ర మోడీ.. ఎలక్షన్ అన్నపుడు ఆగంకాకుండా ఆచితూచి అడుగులు వేయండి.. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్గా బతకాలి..
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!