KTR: కాంగ్రెస్- బీజేపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు. నేతన్న ఆత్మహత్య వద్దంటూ రాతలు సిరిసిల్ల గోడలపై ఉండేవి.. సిరిసిల్లలో ఇన్ని విద్యాసంస్థలు వస్తాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరు సిరిసిల్ల, గజ్వేల్ లోనే అభివృద్ధి అంటుంటే, సిరిసిల్ల నాయకులు మాత్రం సిరిసిల్లలో అభివృద్ధి ఏం లేదని అంటున్నారు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Read Also: MS Dhoni: రిటైర్మెంట్పై హింట్ ఇచ్చిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ.. 2024లో ఐపీఎల్ ఆడతాడా?
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
కేసీఆర్ న్యాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నాం.. సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధి ని సాదిస్తున్నాం.. కాంగ్రెస్- బీజెపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే.. కుల, మతాల పేరుతో ముందుకు వస్తారని ఆయన మండిపడ్డారు. కులం, మతం కాదు గుణం చూసి ఓటెయ్యండి.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం.. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి.. సిరిసిల్ల చరిత్రలో మొదటి సారి 2014 సిరిసిల్ల ఎమ్మెల్యే కు మంత్రి పదవి వచ్చింది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: MK Stalin: గవర్నర్ని మార్చొద్దు, మాకు ఉపయోగపడుతున్నాడు.. ప్రధానిపై స్టాలిన్ విమర్శలు.
ఇంతకష్టపడి సాదించుకుని.. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతుండట, మెడమీద తల ఉన్నోడు ఎవడైనా ఇతడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతాడని గాంధీ ఆనాడే ఊహించాడు.. కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చారు.. కానీ, ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు.. 55 ఏండ్లలో చేతకాలేదు కానీ, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రూపాయల డిజీల్ 100 రూపాయలు, 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు దేవుడా నరేంద్ర మోడీ.. ఎలక్షన్ అన్నపుడు ఆగంకాకుండా ఆచితూచి అడుగులు వేయండి.. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!