Minister KTR : బండి సంజయ్.. అక్కడ చూసొచ్చి సిగ్గు తెచ్చుకో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకలు హైదరాబాద్లో జరుగుతున్నందున రాష్ట్రంలోని అన్ని గ్రామాల, మండలాలు, జిల్లాల నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకుంటారని, అంతేకాకుండా ప్లీనరీ వేడుకల దృష్ట్యా నగవాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండో దశ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
పాదయాత్ర బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగి కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. బండి సంజయ్ పక్కనే ఉన్న కర్ణాటక సరిహద్దులోని రాయచర్కు వెళ్లిరావాలని, అవసరమైతే ఏసీ కార్లను ఏర్పాటు చేస్తామన్నారు.
అక్కడికి వెళ్లి బీజేపీ పాలన గురించి, రాయచూర్ ఎమ్మెల్యేను అడిగి తెలుసుకోవాలన్నారు. రాయచూర్ ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు రాయచూర్ను తెలంగాణలో కలపాలన్నారని గుర్తు చేశారు. అక్కడికి వెళ్లి చూసొచ్చి సిగ్గు తెచ్చుకోవాలని బండి సంజయ్పై కేటీఆర్ మండిపడ్డారు. నీ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకేం లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!