Minister Harish Rao: అభివృద్ధి, సంక్షేమ పనులన్నింటినీ సిద్దిపేటకే తీసుకెళ్తావని తనని తిడతారని.. కానీ వేరే విషయంలో తనను ఏమీ అనరని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రజలు తన కుటుంబసభ్యులతో సమానమని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలో కొండ భూదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
దేశ, రాష్ట అభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికుల కృషి కోసం ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. న్యాక్ సెంటర్ సహకారంతో భవన నిర్మాణ మహిళా కార్మికులకు కుట్టు మిషన్, మగవారికి ద్విచక్రవాహనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట అందరి సహకారంతో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటకు రైలు వస్తుందన్నారు. ఇక సిద్దిపేటలో విమాన సౌకర్యం తప్ప అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు నవ్వుతూ అన్నారు.