Harish Rao: డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ బీజేపీ పై మంత్రి హరీష రావు మండిపడ్డారు. అమిత్ షా నిధులు మీకు అందాయా అని అడిగే కంటే ముందు, తెలంగాణ కు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండని ప్రశ్నించారు. నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి లేదని మండిపడ్డారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన బోగస్ అంటూ విమర్శించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే.. మీ వైపు రెండు వేళ్లు చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నీళ్లు ,నిధుల ,నియామకాల గురించి అడిగే హక్కు బిజెపి నేతలకు లేదని మండిపడ్డారు. కేంద్రంలో ఎన్ని జాబ్ లు ఇచ్చారో స్పష్టం చేయండని ప్రశ్నించారు హరీష్ రావ్. పెంచిన సిలిండర్ ధరల గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు ఏమి చేశారు ? మోడీ ఒక్క మాట మాట్లాడలేదని ఎద్దేవ చేసారు.
read also: Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’ మరోసారి వాయిదా!
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు .. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చారు.. ఇదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ ప్రాజెక్టులో అవినీతి లేదని స్పష్టం చేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎనీ టైం వాటర్ అంటూ హరీష్ రావ్ అన్నారు. పీయూష్ గోయల్ ఎందుకు బియ్యం తీసుకోవడం లేదో చెప్పాలి కదా ? అని ప్రశ్నించారు. బీజేపీ సభ ద్వారా తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.
read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ కుట్ర పన్నాయి..
మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని విమర్శించారు. యూపీతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం మూడు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తు చేసారు. అమిత్ షా తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్కీమ్ లబ్ధిదారులను అడిగితే నిధులు అందినవ లేదా తెలుస్తుందని అన్నారు. అమిత్ షా ముందు తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. బీజేపీ నిన్న సభ పెట్టి 24 పైసలు తెలంగాణ కు ప్రకటించలేదని మంత్రి హరీష్ మండిపడ్డారు.
- Tags
- Amit Shah
- bjp
- harish rao
- kcr
- ktr
తాజావార్తలు
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
-
Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
-
Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!