Singareni: ప్రధాని మోడీ హటావో-సింగరేణి బచావో.. కేంద్రంపై జంగ్ సైరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni: బొగ్గు బావులను ప్రయివేటు పరం చేస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్సైరన్ మోగిస్తామని సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన ప్రధాని మోడీ… కేంద్ర ప్రభుత్వానికి హటావో సింగరేణి బచావో నినాదం వినిపించేలా మహాధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి బ్లాకులను ప్రయివేటుకు అప్పగించాలన్న కేంద్రం యోచనపై కార్మికులు భగ్గుమంటున్నారు. తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని తొలగిస్తే శాంతి ఉండదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణ తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల గొంతు నొక్కేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే సింగరేణి మహాధర్నాతో సింగరేణిని ఆదుకుంటామన్నారు.
Read also: Sharad Pawar: అదాని, అంబానీలపై దాడి చేయడం కరెక్ట్ కాదు
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, టీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మహాధర్నాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సింగరేణి బ్లాకులను ప్రయివేటుకు అప్పగించాలనే కేంద్రం యోచనలో తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని దూరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, కేంద్రం ప్రైవేటీకరించడం లేదని చెబుతూనే సింగరేణి బొగ్గు బావులను వేలం వేయాలనే నిర్ణయం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేస్తే ఎంతో మంది కార్మికుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన కేంద్రంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేటి మహాధర్నాను ఇల్లెందు, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల కార్మికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల రామగుండం ప్రాంతంలో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. సింగరేణిలో 51% వాటాలున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బావుల ప్రైవేటీకరణ ప్రసక్తి లేదన్నారు. తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని దూరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, అందుకే బొగ్గు గనులను ప్రయివేటుకు అప్పగించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. నల్లబంగారాన్ని ప్రయివేటుకు అప్పగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
IPL2023 : సన్రైజర్స్ బ్యాటింగ్పై పేలుతున్న మీమ్స్
- Tags
- bjp
- BRS
- BRS Party
- jung siren
- PM Modi
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?