Harish Rao: అందరికి రుణమాఫీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం..
- ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారు..
- మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదు..
- రైతు రుణమాఫీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతులకు రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ కావాలని నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది అని విమర్శించారు. డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Kerala: టేకాఫ్కి ముందు విమానంలో పొగలు.. ఫ్లైట్ లో142 మంది ప్రయాణికులు..
Also Read
ఇక, మూసి ప్రక్షాళన చేయాలంటే గోదారి నీళ్లతో ప్రక్షాళనల చేయ్యు అని హరీష్ రావు అన్నారు. కానీ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదు అని మండిపడ్డారు. దసరాలోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోతే.. దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేపడతామని మాజీ మంత్రి సవాల్ విసిరారు. రుణమాఫీ చేయమంటే రోజుకోక డైవర్షన్ తో కాలయాపన చేస్తున్నారు.. రైతు రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఒకటి మంత్రుల వైఖరి ఒకటి… ఏది నమ్మాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు పండించే ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి.. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు వచ్చే ఎమ్మెల్యేలను రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయండి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!