Harish Rao: అందరికి రుణమాఫీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం..
- ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారు..
- మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదు..
- రైతు రుణమాఫీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతులకు రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ కావాలని నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది అని విమర్శించారు. డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Kerala: టేకాఫ్కి ముందు విమానంలో పొగలు.. ఫ్లైట్ లో142 మంది ప్రయాణికులు..
Also Read
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
- Collector Advaith Kumar : మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ.. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న గిరిజన సంఘాలు.!
- Thorrur Municipality: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత..
ఇక, మూసి ప్రక్షాళన చేయాలంటే గోదారి నీళ్లతో ప్రక్షాళనల చేయ్యు అని హరీష్ రావు అన్నారు. కానీ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదు అని మండిపడ్డారు. దసరాలోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోతే.. దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేపడతామని మాజీ మంత్రి సవాల్ విసిరారు. రుణమాఫీ చేయమంటే రోజుకోక డైవర్షన్ తో కాలయాపన చేస్తున్నారు.. రైతు రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఒకటి మంత్రుల వైఖరి ఒకటి… ఏది నమ్మాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు పండించే ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి.. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు వచ్చే ఎమ్మెల్యేలను రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయండి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
-
Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
-
CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
-
MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!