Kerala: టేకాఫ్కి ముందు విమానంలో పొగలు.. ఫ్లైట్ లో142 మంది ప్రయాణికులు..
- ప్రమాదం తప్పిన పెను ప్రమాదం
- టేకాఫ్కి ముందు విమానంలో పొగలు
- గుర్తించిన పైలెట్
- ఫ్లైట్ లో142 మంది ప్రయాణికులు సుక్షితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం ఉదయం తిరువనంతపురం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో పొగ వ్యాపించాయి. విమానంలో అలారం మోగింది. దీంతో టేకాఫ్కు ముందే విమానాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చారు. ఈ విమానం తిరువనంతపురం నుంచి మస్కట్కు 142 మంది ప్రయాణికులతో బయలుదేరాల్సి ఉంది. న్యూస్ ఏజెన్సీ ప్రకారం… ఈ సంఘటన ఈ రోజు ఉదయం 10:30 గంటలకు జరిగింది. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా స్మోక్ అలారం (ఫ్లైట్ స్మోక్ అలారం) మోగింది. విమానంలో పొగలు కమ్ముకున్నాయి. టేకాఫ్ కి ముందే ఘటన జరగడంతో ప్రయాణికులు తప్పించుకుని.. ఊపిరి పీల్చుకున్నారు.
READ MORE: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్ వర్గాల ప్రకారం.. అనుమానాస్పదంగా అనిపించగానే.. భద్రతను దృష్టిలో ఉంచుకుని, టేకాఫ్కు ముందు వెంటనే విమానాన్ని ఆపాలని నిర్ణయించారు. పైలట్ తెలివి ప్రదర్శించి టేకాఫ్కు ముందే విమానాన్ని నిలిపివేసి తిరిగి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. దీని తరువాత, ప్రయాణీకులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది. తద్వారా వారి ప్రయాణాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముగించవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు.
READ MORE:Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ వచ్చేస్తోంది!
ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరుపుతామని, పొగలు రావడానికి కారణమేమిటో తేలుతుందని ఆయన అన్నారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యంపై ఎయిర్లైన్ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణీకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను త్వరలో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచారు.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..