Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
- టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు
- ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ఆకాష్ చోప్రా ప్రశ్నలు
- ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండానే దిగడం చాలా రిస్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra Trolls Shreyas Iyer Captaincy: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు ఆగడం లేదు. సర్పంచ్ సాబ్ ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై మాజీ భారత ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రశ్నలు లేవనెత్తాడు. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ముందుగా జింబాబ్వేను 125/7 స్కోరుకే పరిమితం చేసి.. అనంతరం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ విజయానంతరం జట్టు కూర్పుపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. భారత్ కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగిందని పేర్కొన్నాడు. ‘ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ మాత్రమే స్పెసలిస్ట్ బౌలర్లు. ఐదో బౌలర్గా శివమ్ దూబేపై ఆధారపడటం ఆశ్చర్యం కలిగించింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగడం చాలా రిస్కీ నిర్ణయం. అయితే దూబే టీమ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. సాధారణంగా బ్యాటింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన దూబేకు పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ బాధ్యత అప్పగించడం ద్వారా టీమ్ మేనేజ్మెంట్ అతనిపై ఎంత విశ్వాసం ఉంచిందో అర్థమవుతుంది’ అని అన్నాడు.
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
భారత్ మ్యాచ్ ప్రారంభం నుంచే వేగాన్ని ఆయుధంగా ఉపయోగించిందని ఆకాష్ చోప్రా విశ్లేషించాడు. ‘మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్లు పేస్ దాడితో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు . చాలా కాలం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన మయాంక్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. 150 కిలోమీటర్ల వేగానికి చేరువలో బంతులు వేయడానికి మయాంక్ ప్రయత్నించడం ఎంతో సంతోషంగా అనిపించింది. అశోక్ శర్మ కూడా కొన్ని పరుగులు ఇచ్చినా.. బాగా బౌలింగ్ చేశాడు. యువ పేసర్ల ప్రదర్శన భారత జట్టుకు భవిష్యత్తులో పెద్ద బలంగా మారే అవకాశముంది’ అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
భారత్ తొలి మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్ కూర్పు, ముఖ్యంగా ఆరో బౌలర్ లేకపోవడం రాబోయే మ్యాచ్ల్లో ఎలా ప్రభావం చూపుతుందో చూడాలని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. జింబాబ్వేపై ఈ విజయం భారత జట్టుకు శుభారంభాన్ని అందించినప్పటికీ.. సిరీస్లో ముందుకు సాగే కొద్దీ జట్టు సమతుల్యత కూడా కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డాడు. మరో బౌలర్ను తీసుకొని ఉండాల్సిందని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?