Liquor Rates: తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం రేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యంపై భారీగా ధరలను పెంచింది. బీరు, లిక్కర్ ఇలా అన్నింటిపై రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీరు బాటిల్ పై రూ.20, విస్కీ, బ్రాందీ లిక్కర్ క్వార్టర్ పై రూ. 20, ఫుల్ బాటిల్ పై రూ. 80 పెంచింది. పెరిగిన రేట్లు మే 19 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అమ్మకాలు ముగిసిన తర్వాత మద్యాన్ని సీజ్ చేసి… నిల్వలు లెక్కించి రేపటి నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన రేట్ల ప్రకారం అమ్మకాలు కొనసాగించనున్నారు.
పెరిగిన ధరలతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు మరింతగా ఆదాయం సమకూరనుంది. ఇప్పటికే బీర్లు తెగ అమ్ముడవుతున్నాయి. వేసవి కాలం కావడంతో కూల్ కూల్ గా బీర్లను లాగించేస్తున్నారు మద్యం ప్రియులు. గతంలో కరోనా సమయంలో బీర్ల సేల్స్ పడిపోయాయి. దీంతో ఆ సమయంలో బీర్ల ధరలను తగ్గించారు. తాజాగా ప్రస్తుతం బీర్ల రేట్లు మరింత ప్రియం కానున్నాయి.
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
కాగా ధరలు పెరుగుదల సామాన్యులపై భారం పడనుంది. ఏకంగా రూ. 20 నుంచి రూ.80 వరకు పెరగడంతో మందుబాబుల జేబుకు చిల్లు పడనుంది. బీర్ సేల్స్ పెరుగాయని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ధరలను పెంచింది. పెరిగిన మద్యం అమ్మకాలను ప్రభుత్వం క్యాష్ చేసుకునేందుకే మద్యం ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిన మద్యం ధరలతో ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?