KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
- ఏ వర్గం ప్రజలు కూడా ఈ ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా లేరు
- ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
- ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు దాటింది
- పదేళ్లపాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయింది
- అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్కు పోయాం. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీల జాతర పెట్టిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత మాత్రం చెప్పుల జాతర మిగిల్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఆనాటి రోజులు తిరిగి తెస్తానని రేవంత్ నిజమే చెప్పాడు… కానీ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశాడు” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే వెనుకబడ్డామని అంగీకరించారు.
Also Read
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కేటీఆర్ విపులంగా వివరించారు. గోదావరి జలాలు సమృద్ధిగా దొరికే మెడిగడ్డలో ఈ ప్రాజెక్టును నిర్మించామని, 21 పంప్ హౌస్లు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిందని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కట్టినా కేసీఆర్పై సీబీఐ విచారణ పెట్టడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో కూడా ఆదాయం సున్నా అయినా సంక్షేమ పథకాలు ఆగలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీకి మూటలు మోయడమే పని చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం తెలంగాణ అప్పులు మూడు లక్షల కోట్లకు పైగా ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతోందని, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణపై కేసీఆర్కి ఉన్న ప్రేమ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను “దండుపాళ్యం బ్యాచ్”గా అభివర్ణించిన ఆయన, “మన దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?