KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
- ఏ వర్గం ప్రజలు కూడా ఈ ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా లేరు
- ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
- ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు దాటింది
- పదేళ్లపాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయింది
- అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్కు పోయాం. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీల జాతర పెట్టిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత మాత్రం చెప్పుల జాతర మిగిల్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఆనాటి రోజులు తిరిగి తెస్తానని రేవంత్ నిజమే చెప్పాడు… కానీ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశాడు” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే వెనుకబడ్డామని అంగీకరించారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కేటీఆర్ విపులంగా వివరించారు. గోదావరి జలాలు సమృద్ధిగా దొరికే మెడిగడ్డలో ఈ ప్రాజెక్టును నిర్మించామని, 21 పంప్ హౌస్లు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిందని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కట్టినా కేసీఆర్పై సీబీఐ విచారణ పెట్టడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో కూడా ఆదాయం సున్నా అయినా సంక్షేమ పథకాలు ఆగలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీకి మూటలు మోయడమే పని చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం తెలంగాణ అప్పులు మూడు లక్షల కోట్లకు పైగా ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతోందని, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణపై కేసీఆర్కి ఉన్న ప్రేమ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను “దండుపాళ్యం బ్యాచ్”గా అభివర్ణించిన ఆయన, “మన దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.
తాజావార్తలు
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!