Bandi Sanjay : ట్విట్టర్ టిల్లు.. లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.. బండి సంజయ్ కౌంటర్
- "ట్విట్టర్ టిల్లు" అంటూ బండి సంజయ్ ఘాటు విమర్శలు
- "నీ చీకటి రహస్యాలు బయటపడతాయి".. బండి సంజయ్ హెచ్చరిక
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చెల్లెలు వ్యాఖ్యలపై సంచలనం
- కేటీఆర్పై బండి సంజయ్ తీవ్ర రాజకీయ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపధ్యంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్ను ఉద్దేశిస్తూ బండి సంజయ్, “ట్విట్టర్ టిల్లు.. నువ్వు చేసిన అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అంటూ వ్యాఖ్యానించారు. లీగల్ నోటీసుల వెనక దాక్కుంటూ మాట్లాడే నీలో ధైర్యం లేదని, గతంలో కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమయ్యావని సంజయ్ విమర్శించారు.
KTR : బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
“నీ చిల్లర చేష్టలకు నేను భయపడను. ధైర్యం ఉంటే ముఖాముఖి రా” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, రాఖీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ సొంత చెల్లెలు భయంతో పారిపోతుందని సంజయ్ ఆరోపించారు. “ఆమె స్వయంగా ఫోన్ ట్యాపింగ్ను అంగీకరించిందని” ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. “48 గంటలు గడువు అంటున్నావ్ కానీ, నీ సమయం సమీపించింది. నీ చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నీకు దాక్కోవడానికి ఎటూ చోటు ఉండదు” అని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇంతటితో ఆగకుండా, “నీ అక్రమాలను సమర్థించుకోవడం ఎంత సులభమో, బీజేపీ నాయకులను బతిమాలి పార్టీ విలీనం చేయడం, లేదా ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమంత్రిని కోరడం కూడా అంతే సులభంగా జరిగేదై ఉండేది” అంటూ బండి సంజయ్ తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రెండు పెద్ద పార్టీల నేతల మధ్య విమర్శల యుద్ధం పచ్చి రాజకీయంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంతదాకా వెళ్లనుంది? లీగల్ నోటీసులు ఏమవుతాయి? అనే అంశాలపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..