ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా, జింబాబ్వే , నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుక జోహెన్స్ బర్గ్ లో అట్టహాసంగా జరిగింది. దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తుండటం విశేషం. ఈ టోర్నమెంట్ కోసం “మేక్ ది సర్కిల్ బిగ్గర్” అనే బ్రాండ్ థీమ్ను ఆవిష్కరించారు. ఆఫ్రికన్ తత్వశాస్త్రమైన “ఉబుంటు” అంటే “నేను ఉన్నాను, ఎందుకంటే మనం ఉన్నాము” అనే భావనతో పాటు ఆఫ్రికన్ సంస్కృతిలో ఐక్యతకు, అతిథి మర్యాదలకు సంకేతంగా నిలిచే చక్రాల అల్లిన బుట్ట ఆధారంగా ఈ బ్రాండ్ డిజైన్ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆఫ్రికా క్రీడా ఉత్సవంలోకి ఆహ్వానించడమే ఈ థీమ్ ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆఫ్రికా ఖండంలోని 12 విభిన్న వేదికల్లో జరగనుంది. ఇందులో దక్షిణాఫ్రికాలోని జోహ్యాన్నెస్బర్గ్, ట్వానే, కేప్ టౌన్, డర్బన్, గెబెహా, బ్లూమ్ఫోంటెన్, పార్ల్, ఈస్ట్ లండన్ నగరాలు; జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్; అలాగే నమీబియాలోని విండ్హాక్ నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. నమీబియా చరిత్రలోనే మొదటిసారిగా ప్రపంచ కప్ మ్యాచ్లకు వేదికగా నిలవబోతోంది. జోహ్యాన్నెస్బర్గ్లోని ఇనాండా పోలో క్లబ్లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రేమ్ స్మిత్, మఖాయా ఎంటిని, హషీమ్ ఆమ్లా, తెంబా బవుమా, కాగిసో రబాడా, హామిల్టన్ మసకడ్జా, రుడాల్ఫ్ జాన్సన్ వాన్ వురెన్ వంటి ప్రముఖ దిగ్గజ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆఫ్రికాలోని 29 అధికారిక భాషలు, విభిన్న సంస్కృతుల కలయికను ప్రతిబింబించేలా ఈ వేడుకను “మూడు దేశాలు – ఒకే హృదయ స్పందన” అనే భావనతో నిర్వహించారు.
Also Read
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
- Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
- Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
- Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
ఈ ప్రపంచ కప్లో మొత్తం 14 జట్లు 57 మ్యాచ్ల్లో పోటీపడనున్నాయి. అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు ఐసీసీ ఈసారి మూడు దశల ఫార్మాట్ను ప్రవేశపెట్టింది. మొదటగా 12 నుండి 14 ర్యాంకుల్లో ఉన్న జట్ల మధ్య ‘సూపర్ సిరీస్’ జరుగుతుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి 30 మ్యాచ్ల లీగ్ నిర్వహిస్తారు. రెండు గ్రూపుల నుండి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 7 జట్లు ‘సూపర్ 7’ దశకు చేరుకుంటాయి. ఆపై రౌండ్-రాబిన్ పద్ధతిలో జరిగే 21 మ్యాచ్ల తర్వాత టాప్ 4 స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఐసీసీ ఛైర్మన్ జై షా , ఇతర అధికారులు ఈ ప్రపంచ కప్ ఆఫ్రికా ఖండపు క్రీడా సంస్కృతిని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
-
Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!