ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా, జింబాబ్వే , నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుక జోహెన్స్ బర్గ్ లో అట్టహాసంగా జరిగింది. దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తుండటం విశేషం. ఈ టోర్నమెంట్ కోసం “మేక్ ది సర్కిల్ బిగ్గర్” అనే బ్రాండ్ థీమ్ను ఆవిష్కరించారు. ఆఫ్రికన్ తత్వశాస్త్రమైన “ఉబుంటు” అంటే “నేను ఉన్నాను, ఎందుకంటే మనం ఉన్నాము” అనే భావనతో పాటు ఆఫ్రికన్ సంస్కృతిలో ఐక్యతకు, అతిథి మర్యాదలకు సంకేతంగా నిలిచే చక్రాల అల్లిన బుట్ట ఆధారంగా ఈ బ్రాండ్ డిజైన్ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆఫ్రికా క్రీడా ఉత్సవంలోకి ఆహ్వానించడమే ఈ థీమ్ ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆఫ్రికా ఖండంలోని 12 విభిన్న వేదికల్లో జరగనుంది. ఇందులో దక్షిణాఫ్రికాలోని జోహ్యాన్నెస్బర్గ్, ట్వానే, కేప్ టౌన్, డర్బన్, గెబెహా, బ్లూమ్ఫోంటెన్, పార్ల్, ఈస్ట్ లండన్ నగరాలు; జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్; అలాగే నమీబియాలోని విండ్హాక్ నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. నమీబియా చరిత్రలోనే మొదటిసారిగా ప్రపంచ కప్ మ్యాచ్లకు వేదికగా నిలవబోతోంది. జోహ్యాన్నెస్బర్గ్లోని ఇనాండా పోలో క్లబ్లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రేమ్ స్మిత్, మఖాయా ఎంటిని, హషీమ్ ఆమ్లా, తెంబా బవుమా, కాగిసో రబాడా, హామిల్టన్ మసకడ్జా, రుడాల్ఫ్ జాన్సన్ వాన్ వురెన్ వంటి ప్రముఖ దిగ్గజ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆఫ్రికాలోని 29 అధికారిక భాషలు, విభిన్న సంస్కృతుల కలయికను ప్రతిబింబించేలా ఈ వేడుకను “మూడు దేశాలు – ఒకే హృదయ స్పందన” అనే భావనతో నిర్వహించారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ఈ ప్రపంచ కప్లో మొత్తం 14 జట్లు 57 మ్యాచ్ల్లో పోటీపడనున్నాయి. అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు ఐసీసీ ఈసారి మూడు దశల ఫార్మాట్ను ప్రవేశపెట్టింది. మొదటగా 12 నుండి 14 ర్యాంకుల్లో ఉన్న జట్ల మధ్య ‘సూపర్ సిరీస్’ జరుగుతుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి 30 మ్యాచ్ల లీగ్ నిర్వహిస్తారు. రెండు గ్రూపుల నుండి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 7 జట్లు ‘సూపర్ 7’ దశకు చేరుకుంటాయి. ఆపై రౌండ్-రాబిన్ పద్ధతిలో జరిగే 21 మ్యాచ్ల తర్వాత టాప్ 4 స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఐసీసీ ఛైర్మన్ జై షా , ఇతర అధికారులు ఈ ప్రపంచ కప్ ఆఫ్రికా ఖండపు క్రీడా సంస్కృతిని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!