ఏడేళ్లలో అందరికీ ఎంతో మేలు జరిగింది… మంత్రి కొప్పుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఎన్నికల్లో వేడి పెరుగుతూనే వుంది. జమ్మికుంటలో మహిళల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటువేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఉందని, ఏడేళ్లలో ఏ యే వర్గానికి ఎంత మేలు జరిగిందో మీకు తెలుసు అన్నారు.
ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలను కెసిఆర్ గుర్తించి పరిష్కరించారని..తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ అంతటా స్వచ్ఛమయిన నీరు లభిస్తోందన్నారు కొప్పుల ఈశ్వర్. బోరు నీళ్లు,సుద్ధ నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు ఎక్కడా లేవు. స్వచ్ఛమైన గోదావరి నీళ్లు, పరిశుద్ధమైన తాగు నీళ్లు అందుతున్నాయి. 46వేల చెరువుల మరమ్మత్తులు జరిగాయి.
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
కాళేశ్వరం ద్వారా సాగు నీరందుతోంది. సకాలంలో పుష్కలంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇక మహిళల సంక్షేమం గురించి చెప్పాలంటే..లక్ష మంది ఒంటరి మహిళలను గుర్తించి పింఛన్లు అందిస్తున్నం.బీడీ కార్మికులను గుర్తించి పింఛన్లు ఇస్తున్నామన్నారు. దేశంలో చాలా మంది ఉన్నరు,కానీ ఒక మన రాష్ట్రంలోనే 7లక్షల మంది బీడి కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం.
కాన్పులకు ఖర్చు లేకుండా, ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నయ్. నూటికి 70 శాతం ఆపరేషన్లు చేసి కాన్పులు జరిగేవి, ఇప్పుడు కెసిఆర్ కిట్,అమ్మ ఒడి పథకాల ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఆడబిడ్డ పుడితే 13వేలు,మగ పిల్లగాడు పుడితే 12వేలు ఇస్తున్నం. చేప పిల్లల్ని ఉచితంగా అందిస్తూ ముదిరాజులు,గంగపుత్రులకు చేతినిండా పని కల్పిస్తున్నం అన్నారు. ప్రజలకు ఇన్నిరకాల మేలు జరుగుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి. అందరికీ అన్నీ ఇచ్చేది టీఆర్ఎస్ అయితే.. గుంజుకునే,తీసుకునే పార్టీ బిజెపి అని దుయ్యబట్టారు.
2వేల పింఛన్లు ఒక తెలంగాణలో మాత్రమే ఇస్తున్నం. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. మీరంతా మంచి మనసు ఉన్న వాళ్లు,సేవా దృక్పథంతో ముందుకు పోతున్నరు. గెల్లు శ్రీనివాస్ మంచి వాడు,ఓట్లు వేయండి,మరిన్ని వేయించండి. మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ప్రభుత్వం నుంచి తప్పక సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు కొప్పుల.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!