Munugode By Election: మునుగోడుతో తెలంగాణ భవిష్యత్ ముడిపడి ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయో.. రావో.. నిర్ణయించేందుకు ఆ ప్రాంత ప్రజలే.. కానీ, మునుగోడుతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముడిపడి ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైన తరుణంలో.. ఆపేందుకు కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, రాజగోపాల్రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.. ఇవాళ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయడం.. ఉత్తమ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి.. ఆయనతో సమావేశమై రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని చేరవేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా అన్నారు.. ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధంగా పేర్కొన్నారు. ఇది ధర్మ యుద్ధం.. మునుగోడు ప్రజలతో మాట్లాడతా.. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధం అవుతుందన్నారు.. ప్రజాస్వామ్య నెలకొనాలంటే మునుగోడు తీర్పు తెలంగాణ ప్రజల మార్పు అవుతుందని అభివర్ణించారు.
Read Also: Merugu Nagarjuna: రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
Also Read
అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్య పై నేను మాట్లాడాను అని గుర్తుచేశారు రాజగోపాల్రెడ్డి.. అభివృద్ధి అంటే గజ్వేల్ సిరిసిల్ల, సిద్ధిపేట అనే విధంగా చేశారని విమర్శించిన ఆయన.. నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాని కలిసిన తర్వాత రాజీనామా అంశం చర్చించకపోయినా.. పార్టీ మరతా అని చెప్పకపోయినా.. ప్రచారం జరిగిందన్నారు.. అయితే, ఉపఎన్నిక సీఎం కేసీఆర్ అనుకుంటే రాదు.. మునుగోడు ప్రజలనుకుంటే వస్తుందన్నారు.. కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి మునుగోడు అభివృద్ధికి నిధులు వస్తాయి అనుకుంటే ఉప ఎన్నిక వస్తుందని తెలిపారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేస్తాయి.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఈ ఉపఎన్నిక యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నోరు మూయించిన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు.. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యేల హక్కులను హరించారు.. రాబోయే 10 – 15 రోజుల్లో మునుగోడులో చర్చించిన యుద్ధం ప్రకటిస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!