Komatireddy Rajgopal Reddy: ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్.. మునుగోడు రావాలనే రాజీనామా చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫామ్హౌస్లో పడుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మునుగోడు రావాలనే రాజీనామా చేశానంటూ పేర్కొన్నారు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… రేపు మునుగోడులో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇతర బీజేపీ నేతలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పాలన పోయి.. ప్రజా స్వామ్య ప్రభుత్వం రావాలి అంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.. నా స్వార్థం కోసం నేను రాజీనామ చేయలేదు… ఫామ్హౌస్లో పడుకున్న సీఎం మునుగోడు రావాలని నేను రాజీనామ చేశానన్నారు.. స్వార్థం కోసం అయితే ఉప ఎన్నికకు పోయే వాడిని కాదని స్పష్టం చేశారు.. మునుగోడు ప్రజలు తమను తాము గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.
Read Also: Gautam Adani: తగ్గేదే లే అంటున్న గౌతం అదానీ.. మరో భారీ డీల్..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఇక, మునుగోడులో టీఆర్ఎస్ సభ పెట్టుకోవడంలో అర్థం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఎన్నికల ముందు బీజేపీని బద్నాం చేయడం టీఆర్ఎస్కు అలవాటు అన్నారు.. ఎనిమదేళ్లుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారు.. బీజేపీ మీ లాగా కుటుంబ పార్టీ కాదు… మీ లాగా అవినీతి పార్టీ కాదన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం సీఎం కేసీఆర్కి అలవాటు అని గుర్తుచేసిన కిషన్రెడ్డి.. సీఎం కేసీఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫామ్హైస్లో వేసుకుంటారు అని సెటైర్లు వేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఇక్కడ అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇక, కేసీఆర్కు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలే కనిపిస్తాయి.. గజ్వేల్, ఆయన కొడుకు సిరిసిల్ల, అల్లుడి సిద్దిపేటే అభివృద్ధి చెందుతాయి.. హైదరాబాద్ నడిబొడ్డున కూడా అభివృద్ధి ఉండదని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!