Komatireddy Rajgopal Reddy: ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్.. మునుగోడు రావాలనే రాజీనామా చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫామ్హౌస్లో పడుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మునుగోడు రావాలనే రాజీనామా చేశానంటూ పేర్కొన్నారు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… రేపు మునుగోడులో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇతర బీజేపీ నేతలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పాలన పోయి.. ప్రజా స్వామ్య ప్రభుత్వం రావాలి అంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.. నా స్వార్థం కోసం నేను రాజీనామ చేయలేదు… ఫామ్హౌస్లో పడుకున్న సీఎం మునుగోడు రావాలని నేను రాజీనామ చేశానన్నారు.. స్వార్థం కోసం అయితే ఉప ఎన్నికకు పోయే వాడిని కాదని స్పష్టం చేశారు.. మునుగోడు ప్రజలు తమను తాము గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.
Read Also: Gautam Adani: తగ్గేదే లే అంటున్న గౌతం అదానీ.. మరో భారీ డీల్..
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ఇక, మునుగోడులో టీఆర్ఎస్ సభ పెట్టుకోవడంలో అర్థం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఎన్నికల ముందు బీజేపీని బద్నాం చేయడం టీఆర్ఎస్కు అలవాటు అన్నారు.. ఎనిమదేళ్లుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారు.. బీజేపీ మీ లాగా కుటుంబ పార్టీ కాదు… మీ లాగా అవినీతి పార్టీ కాదన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం సీఎం కేసీఆర్కి అలవాటు అని గుర్తుచేసిన కిషన్రెడ్డి.. సీఎం కేసీఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫామ్హైస్లో వేసుకుంటారు అని సెటైర్లు వేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఇక్కడ అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇక, కేసీఆర్కు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలే కనిపిస్తాయి.. గజ్వేల్, ఆయన కొడుకు సిరిసిల్ల, అల్లుడి సిద్దిపేటే అభివృద్ధి చెందుతాయి.. హైదరాబాద్ నడిబొడ్డున కూడా అభివృద్ధి ఉండదని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!