Kishan Reddy : ఫాంహౌస్ కేసులో కొండను తవ్వి తొండను కూడా పట్టలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ శిక్షణా తరగతులు హైదరాబాద్లోని శామీర్పేటలో గల రిసార్ట్లో జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులను తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ బ్రాండ్ మాకు అవసరం లేదు.. మాది భారత్ బ్రాండ్ అంటూ టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వెల్ నెస్ సెంటర్స్ ని బస్తీ దవాఖానాలుగా మార్చి నడిపిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం… ప్రజలకు ప్రభుత్వంకి మధ్య దళారి వ్యవస్థ లేకుండా చేస్తుందని, దళిత బంధు లాంటి పథకాలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నవాళ్లకే ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా..కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో ఎక్కడైనా వివక్ష ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Mamata Benerjee: డిసెంబర్ 5న ప్రధానితో మమత కీలక భేటీ.. ఆ అంశాలపై చర్చించే అవకాశం
ఓట్ల కోసం హిందూయిజాన్ని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీకి ఏ మతం తక్కువ కాదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఉన్న దేశంలో 5వ స్థానంలో ఉన్నామని ఆయన వెల్లడించారు. ఆర్థిక రంగంలో బ్రిటన్ ను కూడా వెనక్కి నెట్టేశామని, పాకిస్థాన్ వెళ్లి సీఎం కేసీఆర్ ఆరు నెలలు ఉండి వస్తే అక్కడ పరిస్థితి తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఫాం హౌస్ ఫైల్స్ కు బీజేపీ భయపడదని, అందులో కొండను తవ్వి తొండను కూడా పట్టలేరని ఆయన విమర్శించారు. అందులో ఏముందో అర్థం కావడం లేదని, గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు… సీబీఐపై నిషేదం పెట్టారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Also Read
Also Read : Kishan Reddy : బీజేపీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేము
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..