Ponguleti: రైతు బంధుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి.. వారికి మాత్రం లేదని వెల్లడి!
- సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తాం..
- భూమి ఉన్న వారందరికీ రైతు బంధు అందిస్తాం..
- రియల్ ఎస్టేట్ భూములకి ఒక్క రూపాయి కూడా ఇవ్వం: మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని వారు ఎవరో రెచ్చగొడితే వాళ్ల మాటలు విని మీరు అభద్రతకు లోనూ కావొద్దని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక, రైతు బంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుంటుంది.. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తాం.. కానీ, రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం.. పవన్ కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఓపెన్..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ఇక, రైతు బంధు విషయంలో ఎవరు అభద్రతకు లోనూ కావొద్దు అందరికీ ప్రభుత్వ పథకాలు వస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల్లో ప్రత్యర్ధులు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోనూ కావద్దు.. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లని పూర్తి చేసి ప్రజలకి అందిస్తాం.. మొదటి విడతగా 3,500 ఇస్తున్నాం.. గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
మా ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్ష్యపూరితంగా చర్యలు చేపట్టడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కారు రేసింగ్ లో చట్టం తన పని తానే చేసుకుని పోతుంది.. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డినీ లొట్టపీస్ ముఖ్యమంత్రి అన్నారు ఆయన బాషకు నమస్కారం.. ఆయన మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారు.. విచారణ కాకుండా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరినీ అరెస్టు చేయదు.. అది బండి సంజయ్ కి కూడ బాగా తెలుసు.. విచారణ లేకుండా ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయరు.. ఏసీబీ రంగాల్లోకి రాగానే ఈడీ ఎంటర్ వచ్చింది.. స్టేట్ గవర్నమెంట్ పొల్యూట్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ కూడా ఎందుకు రంగంలోకి వచ్చింది.. అందులో అవినీతి జరిగిందని రుజువైంది కాబట్టి ఈడీ రంగంలోకి వచ్చింది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!