Pawan Kalyan: విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం.. పవన్ కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఓపెన్..
- విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్..
- 2 గంటల పాటు పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా స్టాళ్ల ఓపెన్..
- భారీ స్థాయిలో పుస్తకాలు కొనుగోలు చేసిన డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపటితో ఈ పుస్తక మహోత్సవం ముగియనుండగా.. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు ఉదయమే పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉదయం 2 గంటల పాటు పవన్ కల్యాణ్ కోసం స్టాళ్లను తెరిచి ఉంచాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేవలం పవన్ కల్యాణ్ కోసం కొన్ని స్టాళ్లు ఆయన అడిగినవి తెరిచి ఉంచారు.. పవన్ కల్యాణ్ ఆయా స్టాళ్లను సందర్శిస్తూ.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం కూడా కొనుగోలు చేశారు..
Read Also: Costly Catch: ఒంటి చేత్తో క్యాచ్ పట్టి.. రూ.90 లక్షలు పట్టుకెళ్లిన ప్రేక్షకుడు
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
కల్యాణి పబ్లికేషన్స్, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించిన పవన్ కల్యాణ్.. చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు.. ఇక, ఆ తర్వాత కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఈ పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదనపడతానని.. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!