Ponguleti: రైతు బంధుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి.. వారికి మాత్రం లేదని వెల్లడి!
- సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తాం..
- భూమి ఉన్న వారందరికీ రైతు బంధు అందిస్తాం..
- రియల్ ఎస్టేట్ భూములకి ఒక్క రూపాయి కూడా ఇవ్వం: మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని వారు ఎవరో రెచ్చగొడితే వాళ్ల మాటలు విని మీరు అభద్రతకు లోనూ కావొద్దని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక, రైతు బంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుంటుంది.. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తాం.. కానీ, రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం.. పవన్ కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఓపెన్..
Also Read
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇక, రైతు బంధు విషయంలో ఎవరు అభద్రతకు లోనూ కావొద్దు అందరికీ ప్రభుత్వ పథకాలు వస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల్లో ప్రత్యర్ధులు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోనూ కావద్దు.. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లని పూర్తి చేసి ప్రజలకి అందిస్తాం.. మొదటి విడతగా 3,500 ఇస్తున్నాం.. గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
మా ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్ష్యపూరితంగా చర్యలు చేపట్టడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కారు రేసింగ్ లో చట్టం తన పని తానే చేసుకుని పోతుంది.. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డినీ లొట్టపీస్ ముఖ్యమంత్రి అన్నారు ఆయన బాషకు నమస్కారం.. ఆయన మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారు.. విచారణ కాకుండా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరినీ అరెస్టు చేయదు.. అది బండి సంజయ్ కి కూడ బాగా తెలుసు.. విచారణ లేకుండా ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయరు.. ఏసీబీ రంగాల్లోకి రాగానే ఈడీ ఎంటర్ వచ్చింది.. స్టేట్ గవర్నమెంట్ పొల్యూట్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ కూడా ఎందుకు రంగంలోకి వచ్చింది.. అందులో అవినీతి జరిగిందని రుజువైంది కాబట్టి ఈడీ రంగంలోకి వచ్చింది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..