Ponguleti: రైతు బంధుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి.. వారికి మాత్రం లేదని వెల్లడి!
- సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తాం..
- భూమి ఉన్న వారందరికీ రైతు బంధు అందిస్తాం..
- రియల్ ఎస్టేట్ భూములకి ఒక్క రూపాయి కూడా ఇవ్వం: మంత్రి పొంగులేటి
Ponguleti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని వారు ఎవరో రెచ్చగొడితే వాళ్ల మాటలు విని మీరు అభద్రతకు లోనూ కావొద్దని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక, రైతు బంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుంటుంది.. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తాం.. కానీ, రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం.. పవన్ కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఓపెన్..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ఇక, రైతు బంధు విషయంలో ఎవరు అభద్రతకు లోనూ కావొద్దు అందరికీ ప్రభుత్వ పథకాలు వస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల్లో ప్రత్యర్ధులు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోనూ కావద్దు.. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టి వదిలేసిన అన్ని ఇండ్లని పూర్తి చేసి ప్రజలకి అందిస్తాం.. మొదటి విడతగా 3,500 ఇస్తున్నాం.. గ్రామ కమిటీలో అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
మా ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్ష్యపూరితంగా చర్యలు చేపట్టడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కారు రేసింగ్ లో చట్టం తన పని తానే చేసుకుని పోతుంది.. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డినీ లొట్టపీస్ ముఖ్యమంత్రి అన్నారు ఆయన బాషకు నమస్కారం.. ఆయన మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారు.. విచారణ కాకుండా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరినీ అరెస్టు చేయదు.. అది బండి సంజయ్ కి కూడ బాగా తెలుసు.. విచారణ లేకుండా ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయరు.. ఏసీబీ రంగాల్లోకి రాగానే ఈడీ ఎంటర్ వచ్చింది.. స్టేట్ గవర్నమెంట్ పొల్యూట్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ కూడా ఎందుకు రంగంలోకి వచ్చింది.. అందులో అవినీతి జరిగిందని రుజువైంది కాబట్టి ఈడీ రంగంలోకి వచ్చింది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Chiranjeevi: విజయ్ విజయంపై స్పందించిన చిరంజీవి
-
PM Modi Reaction: దీదీ కోటలో మోడీ సునామీ.. బెంగాల్ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా! ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/
-
Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!