Khammam Municipal Politics : మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి ముగియడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరకు తమ అభ్యర్థులను కాపాడుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని ప్రత్యేక వాహనాల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లేదా విశాఖపట్నం వంటి ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
మరోవైపు, కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు వారిని రాత్రికి రాత్రే హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికల సమయానికి వీరిని నేరుగా కల్లూరుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సత్తుపల్లి , కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఇప్పటికే పార్టీల లోపల తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సామాజిక సమీకరణాలు , పార్టీ విధేయతను బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు కౌన్సిలర్లందరినీ ఐకమత్యంగా ఉంచడం కోసం ఈ క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్ కొత్త.. ప్రేమాయణం!