CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- సోషల్ మీడియా ప్రచారంపై ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
- పార్టీ కోసం పనిచేయడంలో ఎవరికీ మినహాయింపు లేదన్న రేవంత్
- ప్రతి 10 రోజులకు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని మంత్రులకు ఆదేశం
- వలస ఓటర్ల ఓట్లు డిలీట్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూనే, క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా సోషల్ మీడియా వారియర్లుగా మారి, ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ‘జమీందార్లు’గా తయారయ్యారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ వ్యక్తిగత ప్రచారం తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను అస్సలు ప్రచారం చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను, క్యాడర్ను ప్రజాప్రతినిధులు విస్మరించకూడదని సీఎం హెచ్చరించారు. “పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా పనిచేయాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు… ఇలా ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇందులో నాతో పాటు ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు” అని రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఇకపై ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజును పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసమే కేటాయించాలని, నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని సీఎం ఆదేశించారు. కేవలం మంత్రులకే కాకుండా తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెబుతూ.. తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు కేవలం కార్యకర్తల కోసమే సమయం ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన కాంగ్రెస్ అనుకూల ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా (డిలీట్ కాకుండా) చాలా జాగ్రత్త పడాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!