CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- సోషల్ మీడియా ప్రచారంపై ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
- పార్టీ కోసం పనిచేయడంలో ఎవరికీ మినహాయింపు లేదన్న రేవంత్
- ప్రతి 10 రోజులకు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని మంత్రులకు ఆదేశం
- వలస ఓటర్ల ఓట్లు డిలీట్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూనే, క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా సోషల్ మీడియా వారియర్లుగా మారి, ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ‘జమీందార్లు’గా తయారయ్యారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ వ్యక్తిగత ప్రచారం తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను అస్సలు ప్రచారం చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను, క్యాడర్ను ప్రజాప్రతినిధులు విస్మరించకూడదని సీఎం హెచ్చరించారు. “పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా పనిచేయాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు… ఇలా ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇందులో నాతో పాటు ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు” అని రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఇకపై ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజును పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసమే కేటాయించాలని, నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని సీఎం ఆదేశించారు. కేవలం మంత్రులకే కాకుండా తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెబుతూ.. తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు కేవలం కార్యకర్తల కోసమే సమయం ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన కాంగ్రెస్ అనుకూల ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా (డిలీట్ కాకుండా) చాలా జాగ్రత్త పడాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan For Aqua Farmers: రైతుల కోసం మరో ఉద్యమానికి జగన్ సిద్ధం.. ప్రభుత్వానికి డెడ్లైన్
-
FIFA World Cup 2026: “వెంటనే యూఎస్ విడిచి వెళ్లండి”.. ఫిఫా వరల్డ్ కప్లో ఇరాన్కు ఘోర అవమానం..
-
Human Skeletons: బయటపడ్డ తలలు లేని అస్థిపంజరాలు.. ఏంటా మిస్టరీ..
-
Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
-
Sanchita Ugale: మరాఠీ నటి సంచితా ఉగలే మృతికి కారణమిదేనా? ఇంత జరిగిందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?