Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి పరిష్కారం
- బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్కార్ నిర్ణయం
- 310 కుటుంబాలకు టోకెన్లు.. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
- ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదలకు కొత్త ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ, రేపు (బుధవారం) ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది.
LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
గత నెల 24న వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు, ప్రాథమికంగా 310 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, బాధితులు తమ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది.
Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు అన్యాయం జరగనివ్వబోమని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వెలుగుమట్లలోని వివాదాస్పద భూమిని భవిష్యత్ అవసరాల కోసం లేదా ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని యోచిస్తున్న ప్రభుత్వం, బాధితులకు మాత్రం ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా మెరుగైన స్థలాలను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో గత కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న వందలాది కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నిండనున్నాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?