Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
- పారదర్శక కొనుగోళ్లకు మంత్రి ఆదేశాలు
- డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- 8 మంది బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన వైద్య పరికరాలను (మెడికల్ ఎక్విప్మెంట్) వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ప్రొక్యూర్మెంట్ (కొనుగోలు) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోటిలోని టీజీఎంఎస్ఐడీసీ (TGMSIDC) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైద్య పరికరాల కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ, పరికరాల పనితీరు, మెయింటెనెన్స్ , కొత్త ఆసుపత్రులకు అవసరమైన సదుపాయాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే ప్రతి పరికరం నాణ్యమైనదిగా ఉండాలని, భవిష్యత్తులో కొనుగోళ్లన్నీ ఒకే విధమైన ప్రామాణిక విధానాల ప్రకారం జరగాలని స్పష్టం చేస్తూ, సరికొత్త విధానానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్
వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకు ఈ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ‘ఎండ్-టు-ఎండ్ డిజిటల్ టూల్’ను త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలన్నారు. దీని ద్వారా ఇండెంట్ పెట్టినప్పటి నుండి ఆసుపత్రిలో పరికరం ఇన్స్టాలేషన్ అయ్యే వరకు ప్రతి దశను ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేసే వీలుంటుందని తెలిపారు. అలాగే, ఆసుపత్రులలోని పరికరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించేందుకు ఒక ‘సెంట్రలైజ్డ్ డ్యాష్బోర్డ్’ ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో దీనిపై సమీక్ష జరపాలని ఆదేశించారు.
Also Read
- Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
నిబంధనల ఉల్లంఘనపై కఠిన పెనాల్టీలు.. కొత్తగా బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం
ప్రస్తుతం అమలులో ఉన్న కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటనన్స్ కాంట్రాక్ట్ (CAMC) అగ్రిమెంట్లను పునఃసమీక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. సర్వీస్ లెవల్ అగ్రిమెంట్స్ (SLAs) పాటించకుండా నిర్లక్ష్యం వహించే వెండర్లపై కఠినమైన పెనాల్టీలు (జరిమానాలు) విధించేలా నిబంధనలను సవరించాలన్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ ఎక్విప్మెంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది బయోమెడికల్ ఇంజినీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. వీరిలో హైదరాబాద్ రీజియన్కు నలుగురిని, అలాగే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్లకు ఒక్కొక్కరిని చొప్పున కేటాయించి మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?