Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
- పారదర్శక కొనుగోళ్లకు మంత్రి ఆదేశాలు
- డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- 8 మంది బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన వైద్య పరికరాలను (మెడికల్ ఎక్విప్మెంట్) వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ప్రొక్యూర్మెంట్ (కొనుగోలు) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోటిలోని టీజీఎంఎస్ఐడీసీ (TGMSIDC) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైద్య పరికరాల కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ, పరికరాల పనితీరు, మెయింటెనెన్స్ , కొత్త ఆసుపత్రులకు అవసరమైన సదుపాయాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే ప్రతి పరికరం నాణ్యమైనదిగా ఉండాలని, భవిష్యత్తులో కొనుగోళ్లన్నీ ఒకే విధమైన ప్రామాణిక విధానాల ప్రకారం జరగాలని స్పష్టం చేస్తూ, సరికొత్త విధానానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్
వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకు ఈ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ‘ఎండ్-టు-ఎండ్ డిజిటల్ టూల్’ను త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలన్నారు. దీని ద్వారా ఇండెంట్ పెట్టినప్పటి నుండి ఆసుపత్రిలో పరికరం ఇన్స్టాలేషన్ అయ్యే వరకు ప్రతి దశను ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేసే వీలుంటుందని తెలిపారు. అలాగే, ఆసుపత్రులలోని పరికరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించేందుకు ఒక ‘సెంట్రలైజ్డ్ డ్యాష్బోర్డ్’ ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో దీనిపై సమీక్ష జరపాలని ఆదేశించారు.
Also Read
నిబంధనల ఉల్లంఘనపై కఠిన పెనాల్టీలు.. కొత్తగా బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం
ప్రస్తుతం అమలులో ఉన్న కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటనన్స్ కాంట్రాక్ట్ (CAMC) అగ్రిమెంట్లను పునఃసమీక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. సర్వీస్ లెవల్ అగ్రిమెంట్స్ (SLAs) పాటించకుండా నిర్లక్ష్యం వహించే వెండర్లపై కఠినమైన పెనాల్టీలు (జరిమానాలు) విధించేలా నిబంధనలను సవరించాలన్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ ఎక్విప్మెంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది బయోమెడికల్ ఇంజినీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. వీరిలో హైదరాబాద్ రీజియన్కు నలుగురిని, అలాగే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్లకు ఒక్కొక్కరిని చొప్పున కేటాయించి మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!