KCR National Party: టీఆర్ఎస్.. ఇక బీఆర్ఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గడ్డపై నవ శకం మొదలైంది… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా మారిపోయింది… జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గులాబీ దళపతి కె.చంద్రశేఖర్రావు.. దానికి ఆమోదం పొందేలా చేశారు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం తెలిపింది.. దీంతో.. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది… టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం పెట్టడం.. అది ఆమోదం పొందిన తర్వాత.. అధికారక ప్రకటన చేశారు గులాబీ పార్టీ బాస్… దీంతో.. తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. టీఆర్ఎస్ ప్రతినిధులతో పాటు.. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో బీఆర్ఎస్ ప్రకటన చేశారు కేసీఆర్…
Read Also: Munugode by-election: మునుగోడు బరిలో గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు కేఏ పాల్ అవకాశం..
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించిన సందర్భంలో చప్పట్లు, నినాదాలతో సమావేశంలో మార్మోగింది.. దేశ్కి నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు… బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినదించారు.. కాగా, నేషనల్ హైవేపే కారును పరుగెత్తించాలని గతంలో కూడా ప్రయత్నించారు కేసీఆర్. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో దళపతి ఆలోచనలో సాగాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో.. ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తెలంగాణకు సరైన సహకారం అందడం లేదని.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపిస్తున్న కేసీఆర్. బీజేపీపై తీవ్రస్థాయి పోరాటానికి పిలుపు ఇచ్చారు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని బలంగా కోరుకుంటున్న సీఎం కేసీఆర్.. కొద్దికాలంగా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రగతిభవన్కు వచ్చిన సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులతోపాటు.. పలు పార్టీల నాయకులు.. ఉత్తర భారతానికి చెందిన రైతులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. అంతేకాదు.. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడి వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షపార్టీల అభ్యర్థికే మద్దతు తెలిపి.. జాతీయ స్థాయిలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కేసీఆర్.
తాజావార్తలు
-
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
-
Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!