MLA Kaushik Reddy: పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడొద్దు..
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
- పేదల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడొద్దు..
- ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదు అధికారులు న్యాయంగా పని చేయాలి: కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kaushik Reddy: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటించారు. మంజరైన ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి హోల్డ్ లో పెట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని గొప్పగా చెబుతుంది.. నా నియోజక వర్గంలో 40 వేల మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైతే కేవలం 15 వందల మందికి ప్రోసిడింగ్ కాపీలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిన వాళ్లు పాత ఇల్లు తొలగించి ఇల్లు కట్టుకుంటున్నారు.. 20 ఏళ్ల క్రితం ఐదు సిమెంట్ బస్తాలు రూ. 3 వేలు తీసుకున్నారని చెప్పి ప్రొసిడింగ్ కాపీలు క్యాన్సల్ చేస్తున్నారు.. అధికారులను పంపించి ముగ్గు వేయించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు ఎలా క్యాన్సల్ చేస్తారని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో ఇప్పటి వరకు ఎందుకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వలేదని అడిగారు. దళిత బంధు వచ్చిన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వరు.. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని చెప్పారా సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Rahul Gandhi: “శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల”పై రాహుల్ గాంధీ బొమ్మ.. కాంగ్రెస్పై విమర్శలు..
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
ఇక, ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాటినీ రద్దు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడవద్దు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని యూరియా బస్తాల లోటు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అన్నారు. రైతు బంధు రూ. 15 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇవ్వలేదు.. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి.. కాబట్టి రైతులకు రైతు బంధు ఇస్తున్నారని ఆరోపించారు. పంట వేసి రెండో పంట సమయం వచ్చిన ఇప్పటి వరకు రైతులకు బోనస్ ఇవ్వలేదు.. కళ్యాణ లక్ష్మీ చెక్కుతో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు అడుగుతున్నారు.. నా మీద కోపం ఉంటే నన్ను జైలుకు పంపండి పెదవాళ్ళ విషయంలో రాజకీయం చేయకండి అన్నారు. వారం, పది రోజుల్లో ప్రాసిడింగ్ కాపీ ఇచ్చిన వాళ్లకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వకపోతే లబ్దిదారుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తాం.. ములుగు నియోజక వర్గంలో ప్రశ్నించిన యువకుడి మరణానికి కారణమైన మంత్రి సీతక్కపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదు అధికారులు న్యాయంగా పని చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!