Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Minister Uttam Kumar Fire On Brs

Uttam Kumar Reddy: ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రి గా కాస్త ఆలస్యంగా వచ్చాను..

Published Date :July 19, 2024 , 2:26 pm
By Bhanu
  • గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారు..
  • 93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు..
  • పాలమూరు రంగారెడ్డి- సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతే..
Uttam Kumar Reddy: ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రి గా కాస్త ఆలస్యంగా వచ్చాను..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttam Kumar Reddy: ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రిగా కాస్త ఆలస్యంగా వచ్చానని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారన్నారు. కాళేశ్వరం విషయంలో అన్నీ తప్పుడు లెక్కలే… 93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతే అంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్ట్ లపై తెచ్చిన అప్పులకు 20 వేల కోట్లు వడ్డీలు కట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు. కేంద్ర జలవనరుల సలహాదారు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదం అని పిసి ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారన్నారు. మెడిగడ్డ కాకుండా తుమ్మిడి హట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదిరే అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు నిజాలు నిగ్గు తేల్చాలని అప్పగించామన్నారు. బ్యారేజీ భవిష్యత్ తేల్చాలని కోరామని తెలిపారు.

Read also: Shamshabad: యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. చివరకు..

వారు కొన్ని మధ్యంతర సూచనలు ఇచ్చారు.. వారి సూచనలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బ్యారేజీల్లో కొన్ని పనులు చేసామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆదారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రి గా కాస్త ఆలస్యంగా వచ్చానని.. ఇకపై ప్రతీ నెలా జిల్లా అభివృద్ధి పై సమీక్షలు ఉంటాయన్నారు. కాళేశ్వరంలో పంప్ హౌస్ ల పరిస్థితి పై నివేదిక కోరామని తెలిపారు. ఎల్లంపల్లి పైన ఉన్న పంప్ హౌస్ లు కాలువలు అన్నీ వాడతామన్నారు. రేపు ndsa మీటింగ్ లో అన్నీ మాట్లాడతామని తెలిపారు. ఆయకట్టు స్థిరీకరణ విషయంలో అన్నీ అబద్ధాలే చెప్పారని తెలిపారు. కాళేశ్వరంలో పంప్ చేసిన నీటి కంటే వదిలేసిన నీరే ఎక్కువ అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరం లో 65 టీఎంసీల నీరు మాత్రమే వాడారని అన్నారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే ఏటా రూ.10వేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతుందన్నారు. ప్రజలపై ఇంత భారం మోపారు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ ని ఇంటికి పంపారు.. ఆ పార్టీ క్లోజ్ అయ్యే స్థితికి వచ్చిందన్నారు. తెలంగాణ రైతాంగ విషయంలో ఒక విప్లవాత్మక చర్య తీసుకున్నామని తెలిపారు.

Read also: Microsoft Outage : మైక్రోసాఫ్ట్ కారణంగా ప్రపంచంలో గందరగోళం.. స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నామన్నారు. కార్పొరేట్ రంగానికి ఇచ్చిన రుణమాఫీ రైతులకు ఎందుకు ఇవ్వరు అని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. 12 లక్షల కోట్లు కార్పొరేట్ల కు మోడీ సర్కారు సబ్సిడీ పేరుతో మాఫీ చేసిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో 25 వేల కోట్లు రుణమాఫీ చేస్తే… మా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 31 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు అంశంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసాయన్నారు. జగిత్యాలలో 39262 మందికి 207 కోట్లు, కరీంనగర్ 37745 మందికి 194 కోట్లు, పెద్దపల్లిలో29725ఆడికి 149 కోట్లు సిరిసిల్లలో 23986 మందికి136 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు త్వరలో మా సర్కార్ ఇవ్వబోతోందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేర్వేరుగా ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అంటే మోసం దగా.. కేటీఆర్ కి చెప్తున్న మీరు పదేళ్లలో 25 వేళా కోట్లు రుణమాఫీ చేస్తే 8 నెలల్లో 31 వేల కోట్లు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగలబోతోందన్నారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో చేరబోతున్నారని తెలిపారు.
Banjara Hills: విద్యుత్‌ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • kcr
  • ktr
  • Minister Uttam Kumar fire
  • Minister Uttam Kumar fire on BRS

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions