Vikarabad: రోడ్డు బాగు చేయండి సార్.. గుంతలో ఇరుక్కున్న బస్సు..
- వికారాబాద్ లో ప్రయాణికుల కష్టాలు..
- గుంతలో ఇరుక్కున్న ప్రయాణికుల బస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ లో దోమ మండల ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డు అంతా గుంతలమయంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలవు అన్నట్లు వాటికి తోడుగా రోడ్లపై గుంటలతో ప్రజలు, వాహనదారులు, ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపూర్ గ్రామ మధ్యలో ఉన్న BT రోడ్ గత 10 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామపంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ తిరిగి గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య గురించి ఎన్నో సార్లు R&B అధికారుల , స్థానిక MLA ల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని స్థానికులు అంటున్నారు. రోజు ఎంతో మంది ప్రయాణికులు పనుల నిమిత్తం వెళ్లే ఈ దారిలో ఇలాంటి గుంతల వల్ల అవస్థలు పడాల్సి వస్తుందని అంటున్నారు.
Read also: Banjara Hills: విద్యుత్ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
దాదాపూర్ గ్రామంలో ఉన్న పాఠశాలకు చుట్టుప్రక్కల ఉన్న వివిధ గ్రామాల నుండి ఎంతో మంది విద్యార్థులు కాలినడకన వస్తుంటారని అన్నారు. ఈ గుంతల వల్ల విద్యార్థులు జారీ బురదలో పడిపోవడం, వాహనాలు జారీ పడిపోవడం వంటివి జరగడంతో రోజువారి పనులకు ఇబ్బందిగా మారిందన్నారు. రాత్రి సమయంలో అయితే ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ఇక్కడ కిందపడి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. నిరంతరం ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు పై గుంతలు ఏర్పడటం చాలా ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. దీనికి రుజువు ప్రయాణికులతో వెళుతున్న బస్సు బురద గుంతలో ఇరుక్కుపోవడం అన్నారు. ఆ బస్సును బయటకు తీయలేక నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో చిన్నారులు, మహిళలు ఇబ్బందులకు గురి అయ్యారని మండిపడ్డారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, R&B అధికారులు స్పందించి దాదాపూర్ రోడ్డు పై ఏర్పడిన గుంతలను సందర్శించి ఇక్కడ ప్రస్తుతానికి మరమ్మత్తులు చేసేటట్లు, మరియు ఒక్క కల్వర్టు మంజూరు కూడా చెయ్యాలని స్థానిక గ్రామప్రజలు అందరూ కోరుతున్నారు, లేనిచో త్వరలో వివిధ అధికారుల కార్యాలయాలను ముట్టడి చేస్తాం అని హెచ్చిరించారు.
Prevention Dogs: వీధి కుక్కల బెడద అరికట్టండి.. సీఎం ఆదేశాలతో రంగంలోకి జీహెచ్ఎంసీ..
తాజావార్తలు
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!